నాణ్యమైన పత్తి ఉత్పత్తికి తెలంగాణ ప్రసిద్ధి: మంత్రి పువ్వాడ
నాణ్యమైన పత్తి ఉత్పత్తికి తెలంగాణ ప్రసిద్ధి అన్నారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. అధిక వర్షాల వల్ల పత్తి నల్లబడటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అందుకు ప్రభుత్వం..
నాణ్యమైన పత్తి ఉత్పత్తికి తెలంగాణ ప్రసిద్ధి అన్నారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. అందుకే రాష్ట్రంలోని పత్తి రైతులు ఇబ్బందులు పడకుండా ఉండాలని స్థానికంగానే పత్తి కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఖమ్మం త్రీటౌన్ లోని పత్తి మార్కెట్ నందు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో సిసిఐ ద్వారా ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
రైతులు ఇబ్బందులు పడకుండా పత్తి కొనుగోలు కోసం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 13 సిసిఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం త్రీటౌన్ లోని పత్తి మార్కెట్ నందు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో సిసిఐ ద్వారా ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ.. అధిక వర్షాల వల్ల పత్తి నల్లబడటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రం లో అధికంగా పత్తి పంట వస్తుందని తెలిపారు.మన రాష్ట్రం లో కూడా సీఎం కేసీఅర్ చొరవ తో పత్తి రైతులను ఆదుకునేందకు కృషి చేస్తున్నామని తెలిపారు. రైతులు నాణ్యమైన పత్తి తీసుకురావాలని కోరారు. ఇక నుండి జిల్లా వ్యాప్తంగా అన్ని రైతు వేదికల వద్ద తేమ యంత్రాలను అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. అక్కడే తేమ శాతం సరిచూసుకోవడం ద్వారా ప్రయోజనం కలుగుతుందన్నారు.