ఏపీలో మరో దారుణం.. యువతిపై హత్యాచారం

అమరావతి: మంగళగిరిలో జ్యోతి హత్యాచారాన్ని మరవకముందే ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలంలోని గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెతో వచ్చిన యువకుడు తీవ్ర గాయాలతో మృతదేహం వద్ద పడి ఉన్నాడు. పర్యాటక స్థావరం అయిన గుంటుపల్లి బౌద్ధారామాలకు ఆదివారం మధ్యాహ్నం మూడు జంటలు కొండపైకి వెళ్లాయి. కొంతసేపటికి రెండు జంటలు తిరిగి వెళ్లిపోయాయి. మరో జంట ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో సిబ్బంది పైకి […]

ఏపీలో మరో దారుణం.. యువతిపై హత్యాచారం
Follow us

| Edited By:

Updated on: Feb 25, 2019 | 6:51 AM

అమరావతి: మంగళగిరిలో జ్యోతి హత్యాచారాన్ని మరవకముందే ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలంలోని గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెతో వచ్చిన యువకుడు తీవ్ర గాయాలతో మృతదేహం వద్ద పడి ఉన్నాడు.

పర్యాటక స్థావరం అయిన గుంటుపల్లి బౌద్ధారామాలకు ఆదివారం మధ్యాహ్నం మూడు జంటలు కొండపైకి వెళ్లాయి. కొంతసేపటికి రెండు జంటలు తిరిగి వెళ్లిపోయాయి. మరో జంట ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో సిబ్బంది పైకి వెళ్లి చూశారు. అక్కడ యువతి మృతి చెందగా.. ఆమె పక్కనే యువకుడు తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని ఆసుపత్రికి తరలించారు. యువతి తీవ్ర గాయాలతో దుస్తులు లేకుండా మృతి చెందడంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. యువకుడు నవీన్ భీమడోలు మండలం అజ్జావారిగూడేనికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.