లాక్ డౌన్పై మనసులో మాట బయటపెట్టిన జగన్..!
పూర్తిగా వ్యవసాయరంగంపైనే ఆధారపడిన ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్ కేవలం రెడ్జోన్ ప్రాంతాలలోనే కొనసాగిస్తే బాగుంటుందని సూచనను ప్రధానమంత్రి నరేంద్రమోదీకి చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. మిగిలిన ప్రాంతాలలో వ్యక్తిగత దూరం పాటించేలా..
కరోనా కట్టడిలో భాగంగా.. లాక్డౌన్ను పొడిగించాలా.. లేదా అనే విషయంపై ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు అన్ని రాష్ట్రాల సీఎంలతో చర్చలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్తో కూడా మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రధాని మంత్రిగా మీరు తీసుకునే అన్ని చర్యలనూ తాను బలంగా సమర్థిస్తానని అన్నారు. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ ముందుకు కదలాలన్నది తన అభిప్రాయమని తెలిపారు.
పూర్తిగా వ్యవసాయరంగంపైనే ఆధారపడిన ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్ కేవలం రెడ్జోన్ ప్రాంతాలలోనే కొనసాగిస్తే బాగుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. మిగిలిన ప్రాంతాలలో వ్యక్తిగత దూరం పాటించేలా ఆంక్షలు విధిస్తే సరిపోతుందని చెప్పారు. సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులను వివరించారు సీఎం జగన్. రాష్ట్రంలో 676 మండలాలు ఉంటే 37 మండలాలు రెడ్జోన్లో 44 మండలాలు ఆరెంజ్ జోన్లో ఉన్నాయని ప్రధానికి తెలిపారు జగన్. మిగిలిన 595 మండలాలలో వైరస్ ప్రభావం ఏ మాత్రం లేదని వివరించారు. కాబట్టి అక్కడ లాక్డౌన్ ఎత్తివేస్తే బాగుంటుందని సూచించారు. అయితే ప్రధాని సూచించే వ్యూహాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు జగన్.
ఇవి కూడా చదవండి:
హిందూ మహాసముద్రంలో వింత ఆకారం.. మెరుపు తిగలాంటి
బ్రేకింగ్: జగన్ జెడ్ స్పీడ్.. ఏపీ కొత్త ఎన్నికల కమీషనర్ నియామకం
మహిళల కోసం ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్.. గృహ హింస ఎదుర్కొంటే..
కరోనాపై పోరుకు టిక్టాక్ భారీ సాయం.. రూ.1900 కోట్ల విరాళం
జబర్దస్త్లో ఉన్న కమెడియన్స్ అందరూ నాగబాబువైపే ఉన్నారు.. కుండబద్దలు కొట్టిన ధన్రాజ్