ఏపీలో కరోనా బాధితులకు రూ.2వేల సాయం నిలిపివేత..!
కరోనా సోకి కోవిడ్ కేర్ సెంటర్లు, క్వారంటైన్ కేంద్రాల్లో ఉండి కోలుకున్న వారికి ఆసరా కింద ఏపీ ప్రభుత్వం రూ.2వేల ఆర్థిక సాయాన్ని ఇచ్చే విషయం తెలిసిందే.
Financial Assistance Covid patients: కరోనా సోకి కోవిడ్ కేర్ సెంటర్లు, క్వారంటైన్ కేంద్రాల్లో ఉండి కోలుకున్న వారికి ఆసరా కింద ఏపీ ప్రభుత్వం రూ.2వేల ఆర్థిక సాయాన్ని ఇచ్చే విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సాయాన్ని ప్రభుత్వం నిలిపివేసినట్లు తెలుస్తోంది. జులై నుంచి పలుచోట్ల కరోనా బాధితులకు ఈ సాయం అందడం లేదని సమాచారం.
అయితే కరోనా నుంచి కోలుకున్న వారు 2వారాల పాటు ఇళ్లలోనే ఉండి, పౌష్ఠికాహారం తీసుకోవాలని ఏప్రిల్లో సూచించిన సీఎం జగన్.. అందుకోసం ప్రతి ఒక్కరికి రూ.2వేలు ఇస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో కరోనా నుంచి కోలుకున్న చాలామందికి ఈ సాయం అందింది. అయితే జూలై నుంచి బాధితుల బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుంటున్నా, ఈ సాయం మాత్రం జమ కావడం లేదని తెలుస్తోంది. మరోవైపు నాలుగు రోజుల నుంచి ఆర్ధికసాయం నిలిపివేశామని అనంతపురం జిల్లా కలెక్టర్ చెప్పినట్లు అక్కడి సమాచార శాఖ అధికారులు ప్రకటన జారీ చేశారు. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది. మరోవైపు కరోనాతో మరణించిన వారి అంత్యక్రియల కోసం ఇచ్చే సాయం కూడా ఆగినట్లు తెలుస్తోంది. కాగా రాష్ట్రంలో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో రాష్ట్ర ఖజానాకు ఆర్ధిక భారం పెరగడంతో.. ఈ సాయాన్ని ఆపేసినట్లు సమాచారం. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం దీనిపై అధికారిక ప్రకటనను ఇవ్వలేదు.
Read More: