అక్కడ టీడీపీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది: కన్నా లక్ష్మీనారాయణ

బీజేపీలోకి చేరికలు అనేది నిరంతర ప్రక్రియ అని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని కొందరు ఇతర పార్టీల కార్యకర్తలు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ, వైసీపీ లపై ఛలోక్తులు విసిరారు. ఏపీలో టీడీపీ పూర్తిగా ఖాళీ అయిపోతుందని అన్నారు. అంతేకాదు ఏపీలోని కొన్ని జిల్లాలోని టీడీపీ, వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. త్వరలోనే ఇంకొందరు బీజేపీ […]

అక్కడ టీడీపీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది: కన్నా లక్ష్మీనారాయణ
Follow us

| Edited By:

Updated on: Jul 12, 2019 | 8:38 AM

బీజేపీలోకి చేరికలు అనేది నిరంతర ప్రక్రియ అని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని కొందరు ఇతర పార్టీల కార్యకర్తలు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ, వైసీపీ లపై ఛలోక్తులు విసిరారు. ఏపీలో టీడీపీ పూర్తిగా ఖాళీ అయిపోతుందని అన్నారు. అంతేకాదు ఏపీలోని కొన్ని జిల్లాలోని టీడీపీ, వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. త్వరలోనే ఇంకొందరు బీజేపీ గూటికి చేరుతారని ఆయన చెప్పారు.