గొర్రెల కాపరికి ‘వజ్రం’ తెచ్చిన అదృష్టం
ఆ గొర్రెల కాపరికి అదృష్టం వరిచింది. రోజు పని మీద గొర్రెలను మేపేందుకు పొలాలకు వెళ్లిన అతడికి ఏకంగా 8 క్యారెట్ల వజ్రం దొరికింది. కర్నూల్ జిల్లాలోని తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనిని స్థానిక వజ్రాల వ్యాపారికి అమ్మిన ఆ వ్యక్తి రూ.20లక్షలను పొందాడు. అయితే ఆ వజ్రం వాస్తవ విలువ రూ.50లక్షల వరకు ఉండొచ్చని కొందరు అంటున్నారు. కాగా ఈ వార్త చుట్టుపక్కలను వ్యాపించడంతో పరిసర గ్రామాల ప్రజలు […]
ఆ గొర్రెల కాపరికి అదృష్టం వరిచింది. రోజు పని మీద గొర్రెలను మేపేందుకు పొలాలకు వెళ్లిన అతడికి ఏకంగా 8 క్యారెట్ల వజ్రం దొరికింది. కర్నూల్ జిల్లాలోని తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనిని స్థానిక వజ్రాల వ్యాపారికి అమ్మిన ఆ వ్యక్తి రూ.20లక్షలను పొందాడు. అయితే ఆ వజ్రం వాస్తవ విలువ రూ.50లక్షల వరకు ఉండొచ్చని కొందరు అంటున్నారు. కాగా ఈ వార్త చుట్టుపక్కలను వ్యాపించడంతో పరిసర గ్రామాల ప్రజలు వజ్రాల కోసం జొన్నగిరి గ్రామంలో వేట ప్రారంభించారు. కాగా ఆ ప్రాంతంలో సాధారణంగా భూమి కోతకు గురి అవుతుండటంతో వర్షాకాలంలో లోపల నుంచి వజ్రాలు బయటకు వస్తాయని పరిశోధకులు కనుగొన్నారు. ఇందుకోసం ప్రతి సంవత్సరం అక్కడ వజ్రాల వేట కొనసాగుతూనే ఉంటుంది.