Vijayawada: ప్రాణాల మీదికి తెచ్చిన వ్యాపారి నిర్లక్ష్యం.. వాటర్ అనుకుని యాసిడ్ బాటిల్ ఇవ్వడంతో..
అసలే మండే ఎండలు.. ఆపై గొంతెండిపోతున్న పరిస్థితి.. అలాగని షాప్లో వాటర్ బాటిల్ కొంటున్నారా? వ్యాపారుల నిర్లక్ష్యం మీ ప్రాణాల మీదకు రావొచ్చు. విజయవాడ(Vijayawada) ఏనికేపాడులో అదే జరిగింది. వాటర్ బాటిల్కి బదులు యాసిడ్..
అసలే మండే ఎండలు.. ఆపై గొంతెండిపోతున్న పరిస్థితి.. అలాగని షాప్లో వాటర్ బాటిల్ కొంటున్నారా? వ్యాపారుల నిర్లక్ష్యం మీ ప్రాణాల మీదకు రావొచ్చు. విజయవాడ(Vijayawada) ఏనికేపాడులో అదే జరిగింది. వాటర్ బాటిల్కి బదులు యాసిడ్ బాటిల్ ఇచ్చాడో వ్యాపారి. అది తాగిన స్టూడెంట్ అస్వస్థతకు గురయ్యాడు.లయోలా కాలేజీ యాజమాన్యం విరాళాలు సేకరిస్తోంది. అందులో భాగంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ చైతన్య ఫండ్ కలెక్ట్ చేస్తున్నాడు. ఎండలు బాగా కొడుతుండటంతో దప్పికతో ఓ షాప్ దగ్గరికి వెళ్లాడు. అయితే షాప్ ఓనర్ మాత్రం వాటర్ బాటిల్కి బదులు యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. అప్పటికే విపరీతమైన దాహంతో ఉన్న విద్యార్థి గుటగుటా నీళ్లు అనుకుని తాగేశాడు. యాసిడ్ కడుపులోకి వెళ్లడంతో అస్వస్థతకు గురయ్యాడు.
ఇబ్బందిపడుతున్న విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. ఈనెల 14న జరిగిందీ ఘటన. వ్యాపారి నిర్లక్ష్యం విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. ఘటనపై ఆరాతీస్తున్న పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. తన తప్పు తెలుసుకున్న వ్యాపారి ఆ తర్వాత ఎవరికీ కనిపించకుండా పోయాడు. షాప్ కూడా క్లోజ్ చేశాడు.
ఇవి కూడా చదవండి: Pranahita Pushkaralu: ప్రాణహిత పుష్కరాలకు పోటెత్తుతున్న భక్తులు.. పార్కింగ్ ఫీజుల పేరుతో మొదలైన వసూళ్ల దందా..
Delhi Violence: ఢిల్లీ హనుమాన్ జయంతి ఊరేగింపుపై రాళ్ల దాడి.. వాహనాలకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు..
Viral Video: ఆక్సిజన్ మాత్రమే కాదు దాహం తీరుస్తోంది.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..