విజయవాడ పోలీస్ కమిషనరేట్ అటెండర్ దారుణ హత్య

విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. కమిషనరేట్లో అటెండర్‌గా పనిచేస్తున్న మహేష్‌ను దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. రాత్రి 11 30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. నున్న బైపాస్ రోడ్ లోని సుబ్బారెడ్డి బార్ & రెస్టారెంట్ దగ్గర దుండగులు ఈ హత్యకు పాల్పడ్డారు. స్కూటీపై వచ్చిన దుండగులు కాల్పులు జరిపి అక్కడనుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటన ప్రదేశాన్ని సిపి పరిశీలించారు. నున్న పోలీసులు కేసు నమోదు చేసి […]

విజయవాడ పోలీస్ కమిషనరేట్ అటెండర్ దారుణ హత్య
Follow us

|

Updated on: Oct 11, 2020 | 8:02 AM

విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. కమిషనరేట్లో అటెండర్‌గా పనిచేస్తున్న మహేష్‌ను దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. రాత్రి 11 30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. నున్న బైపాస్ రోడ్ లోని సుబ్బారెడ్డి బార్ & రెస్టారెంట్ దగ్గర దుండగులు ఈ హత్యకు పాల్పడ్డారు. స్కూటీపై వచ్చిన దుండగులు కాల్పులు జరిపి అక్కడనుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటన ప్రదేశాన్ని సిపి పరిశీలించారు. నున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మహేష్ హత్య రియల్ ఎస్టేట్ వివాదంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 5 రౌండ్లు తుపాకీతో కాల్పులు జరిపిన ఆగంతకులు.. పక్కా రెక్కీ నిర్వహించి హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టగా, ఘటనా ప్రదేశంలో క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. ఈ హత్యోదంతంలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నారని పోలీసులు భావిస్తున్నారు.