Andhra Pradesh: అమ్మో లేడీస్ కాదు పెద్ద కిలాడీస్.. ఇంద్ర సినిమాను మించిన చోరీ..!
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో కొత్త తరహా మోసం బయటపడింది. ఇంద్ర సినిమా సీన్ తరహాలో ఇంట్లో ఉన్న బంగారం మొత్తం కొల్లగొట్టారు కిలాడీ లేడీస్.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో కొత్త తరహా మోసం బయటపడింది. ఇంద్ర సినిమా సీన్ తరహాలో ఇంట్లో ఉన్న బంగారం మొత్తం కొల్లగొట్టారు కిలాడీ లేడీస్. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఈ ఘరానా మోసం జరిగింది. బాధిత కుటుంబం గురించి ముందే తెలుసుకుని రంగంలోకి దిగిన కిలాడీ మహిళలు, తెలివిగా బోల్తా కొట్టించారు. మీ అబ్బాయికి ఆరోగ్యం బాగోలేదు, మీ కుటుంబంలో పరిస్థితులు ఇలాగున్నాయ్ అంటూ మాటల్లో పెట్టిన మాయలేడీలు, మేం చెప్పినట్లు చేస్తే అంతా బాగవుతుందని నమ్మించారు. మీ దోషాలన్నీ పోవాలంటే మీ ఇంట్లో ఉన్న బంగారం మొత్తం తేవాలని సూచించారు. ఆ మహిళలు చెప్పిన మాయ మాటలను నమ్మిన కుటుంబ సభ్యులు, పూజల పేరుతో ఇంట్లో ఉన్న బంగారం మొత్తం తెచ్చి వాళ్ల ముందు పెట్టారు. ముడుపు కడతామంటూ బంగారాన్ని తీసుకున్న మాయ లేడీస్, వాళ్లకు తెలియకుండానే మాయం చేశారు(byte). మొత్తం బంగారాన్ని ఓ డబ్బాలో పెట్టి, నిమ్మకాయలు తేవాలని చెప్పారు. నిమ్మకాయలు తెచ్చాక పూజల పేరుతో కొద్దిసేపు హైడ్రామా నడిపిన మహిళలు, 10 నిమిషాల తర్వాత ఆ డబ్బాను తెరవాలని, అప్పుడే మీ కుటుంబంలో ఉన్న దోషాలన్నీ పోతాయని సూచించారు. ఆ తర్వాత అక్కడ్నుంచి వెళ్లిపోయారు. అయితే, 10 నిమిషాల తర్వాత డబ్బా తెరవడంతో బంగారం కనిపించలేదు. ఎప్పుడు మాయం చేశారో తెలియక, మోసపోయామని గ్రహించి, పోలీసులకు కంప్లైంట్ చేశారు బాధితులు.