TTD: టీటీడీ పాలకమండలి ఖరారు. మొత్తం 75 మందికి చోటు.. తెలంగాణ నుంచి ఐదుగురు.!
TTD Update: అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి ఖరారైంది. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు..
అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి ఖరారైంది. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు విడులయ్యే అవకాశం ఉంది. 25 మంది రెగ్యులర్ సభ్యులలో తెలంగాణ నుంచి ఐదుగురికి, కర్ణాటక నుంచి ఇద్దరు, తమిళనాడు నుంచి ఇద్దరికి చోటు దక్కినట్లు తెలుస్తోంది. అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా వివిధ రాష్ట్రాల నుంచి సేవాభావం కలిగిన 50 మంది వ్యక్తులను నియమించినట్లు తెలుస్తోంది.
విధాన నిర్ణయాల్లో ప్రత్యేక ఆహ్వానితులకు ఎలాంటి పాత్ర ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తంగా 75 మందితో టీటీడీ పాలకమండలి ఉండనుంది. కాగా, ఎక్స్అఫిషియో సభ్యులుగా వైసీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలు కొనసాగనున్నారు. అలాగే బ్రాహ్మణ కార్పోరేషణ్ ఛైర్మన్గా సుధాకర్ నియమితులైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తాజాగా ఏపీ సీఎం జగన్ను కలిశారు. బోర్డు సభ్యుల నియామకం, ఎవరిని, ఎంతమందిని నియమించాలనే అంశంపై చర్చించారు. రెండ్రోజుల్లో సభ్యుల నియామకం పూర్తి చేసి ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్
కలుపు మొక్కగా పెరిగే ఈ మొక్క.. మహిళలకు దివ్య ఔషధం.. ఆయుర్వేద మెడిసిన్.. ఆరోగ్యప్రయోజనాలు ఏమిటంటే
వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్