నిందితులు ఎంతోకాలం తప్పించుకోలేరు.. సూత్రదారులెవరో.. పాత్రదారులెవరో వారంతట వారే బయటపడతారు
ఏపీలో దేవాలయాలపై దాడులు జరిగి రోజులు గడుస్తున్నా అసలైన నిందితులు ఇప్పటి వరకూ ఎవరూ అరెస్ట్ కాలేదు. పైగా రోజుకో ఆలయం చొప్పున దాడులు..
ఏపీలో దేవాలయాలపై దాడులు జరిగి రోజులు గడుస్తున్నా అసలైన నిందితులు ఇప్పటి వరకూ ఎవరూ అరెస్ట్ కాలేదు. పైగా రోజుకో ఆలయం చొప్పున దాడులు చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలో నిందుతులను పట్టుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం అండదండలతోనే హిందూ దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారని టీడీపీ, బీజేపీకి చెందిన నేతుల మండిపడుతున్నారు.
ఈ నేపేథ్యంలో దేవాలయాలపై దాడులు చేసే వారు, చేయిస్తున్నవారు ఎంతో కాలం తప్పించుకోలేరని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు. దాడుల సూత్రదారులెవరో వారంతట వారే ఒక్కొక్కరు బయట పడతారని అన్నారు. ఆలయాలపై దాడుల విషయంలో డీజీపీ అనుమానంలో వాస్తవం లేకపోలేదన్నారు.
ప్రపంచాన్ని కాపాడుతున్న దేవుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆలయాలను కూల్చే కుట్ర పూరిత చర్యలు కొన్ని పార్టీల సహకారంతో జరుగుతున్నాయని ఆరోపించారు. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేకే కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు వైవీ సుబ్బారెడ్డి.