ATM: ఏటీఎంలో డబ్బులు డ్రా చేసిన కస్టమర్.. నోట్లు చూసి షాక్.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
ATM: డబ్బు విషయంలో అందరూ చాలా జాగ్రత్తగానే ఉంటారు. పాతనోట్లు, నకిలీ నోట్లు మార్కెట్ను ముంచేస్తున్న తరుణంలో కరెన్సీ విషయంలో అప్రమత్తత ఎంతైనా అవసరమే.
ATM: డబ్బు విషయంలో అందరూ చాలా జాగ్రత్తగానే ఉంటారు. పాతనోట్లు, నకిలీ నోట్లు మార్కెట్ను ముంచేస్తున్న తరుణంలో కరెన్సీ విషయంలో అప్రమత్తత ఎంతైనా అవసరమే. కానీ, ఏకంగా ఏటీఎం సెంటర్ల నుంచే చిరిగిన నోట్లు వస్తే.. అవును మీరు విన్నది నిజమే.. ఏటీఎంలో డబ్బు డ్రా చేసిన వ్యక్తి ఊహించని షాక్ తగిలింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. అనంతపురం జిల్లా రోళ్ల మండల కేంద్రంలోని కర్ణాటక బ్యాంక్ ఏటీఎం సెంటర్లో చిరిగిన నోట్లు బయటపడ్డాయి. ఇదే ప్రాంతానికి చెందిన మంజునాథ్ అనే వ్యక్తి తన అవసరాల నిమిత్తం ఏటీఎం సెంటర్కు వచ్చాడు. ఏటీఎం నుంచి 4వేల రూపాయలు విత్డ్రా చేశాడు. అయితే ఏటీఎం మెషిన్ నుంచి వచ్చిన నోట్లను చూసి అవాక్కయ్యాడు. వచ్చిన నోట్ల నుంచి కొన్ని 500 నోట్లు చిరిగిపోయి రావటంతో అతడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. అప్రమత్తమైన బాధితుడు వెంటనే సంబంధిత బ్యాంకు మేనేజర్ ని కలిసి ఫిర్యాదు చేశాడు.
కాగా, బ్యాంక్ మేనేజర్ చెప్పిన సమాధానం విని బాధితుడు విస్తుపోయాడు. అబ్బే ఇలాంటివన్నీ మాకు సంబంధం లేదంటూ అసంబద్ధమైన సమాధానం చెప్పడు బ్యాంక్ మేనేజర్. అసలు కారణమైన బ్యాంకు సిబ్బందే.. నిర్లక్ష్యపు సమాధానం చెప్పడం అతనికి ఏం చేయాలో పాలుపోలేదు. చివరికి ఈ వ్యవహారం ఎవరికి చెప్పాలో తెలియక బాధితుడు సోషల్ మీడియాను ఆశ్రయించారు. ఆ తరువాత మీడియాతో మొరపెట్టుకున్నాడు. ఇదే తరహాలోనే గత వారం క్రితం మరో కస్టమర్కు కూడా 500 చిరిగిపోయిన నోటు అదే ఏటీఎం సెంటర్ నుంచి వచ్చినట్లు తెలిసింది. దీంతో ఆ ఏటీఎం కి వెళ్లాలంటేనే కస్టమర్లు భయపడిపోతున్నారు. ఏటీఎం లోనే ఇలా చినిగిపోయిన నోట్లు వస్తే ఎలా అంటూ కస్టమర్లు వాపోతున్నారు.
Also read:
TV9 Telugu: సరికొత్త లుక్… సరికొత్త జోష్… నయా టీవీ9 హెడ్క్వార్టర్స్ మన హైదరాబాద్ లో..
ఒకేసారి బద్దలైన 3 అగ్నిపర్వతాలు.. మానవాళికి ముప్పు..? వీడియో