Tomato Prices: మళ్ళీ పెరిగిన టమోటా ధర.. లబోదిబోమంటున్న జనం..
టమాటా ధరలకు(Tomato Prices) కూడా రెక్కలొచ్చాయి. టమాటో ధర మళ్లీ కొండెక్కింది. కర్నూలు మార్కెట్లో 80 రూపాయల ధర పలికింది. రైతు బజార్లో 70 రూపాయలుండగా బయటి మార్కెట్లో పది రూపాయలు ఎక్కువగా ఉంది.
టమాటా ధరలకు(Tomato Prices) కూడా రెక్కలొచ్చాయి. టమాటో ధర మళ్లీ కొండెక్కింది. కర్నూలు మార్కెట్లో 80 రూపాయల ధర పలికింది. రైతు బజార్లో 70 రూపాయలుండగా బయటి మార్కెట్లో పది రూపాయలు ఎక్కువగా ఉంది. ధరలు మండిపోతుండటంతో కొనేదెట్టా అని వినియోగదారులు నిట్టూరుస్తున్నారు. కూరగాయాలతో పాటు టమాటా కూడా సామాన్యుడికి అందనంత ఎత్తులో కూర్చుంది కేవలం పదంటే పది రోజుల వ్యవధిలో ఏకంగా కిలో టమాటా 50 రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో 65 నుంచి 70 రూపాయలు వరకు పలుకుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడం, భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడం కారణంగా టమాటా ధరలు భారీగా పెరిగాయి. కొత్త పంట చేతికొచ్చే వరకు పరిస్థితి ఇలానే ఉండేలా కన్పిస్తోంది. అంటే నెలాఖరు వరకు వంటింట్లో టమాటా కన్పించక పోవచ్చు.
చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్లో కిలో టమాటా 56 రూపాయల వరకు పలుకుతోంది. అన్సీజన్లో అత్యధిక ధర నమోదైంది. గత నాలుగేళ్లుగా అన్సీజన్లో ఇదే అత్యధిక ధరని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెద్దగా టమాటా దిగుబడులు లేకపోవడంతో ధరలకు రెక్కలొచ్చాయి. బయట మార్కెట్లలో పెద్దగా టమాటా కన్పించకపోవడంతో అంతా మదనపల్లి మార్కెట్కే వస్తున్నారు. అన్సీజన్లోనూ టమాటాకు మంచి ధర పలకడంతో వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు రైతులు మాత్రం ఎప్పటిలానే దళారుల చేతుల్లో మోసపోతున్నారు.
గురువారం నాటి మార్కెట్ రేట్ల ప్రకారం కేజీ టమోటా రూ.70 పలుకుతున్నాయి. చిల్లరగా ఈ ధర మరింత ఎక్కువ ఉంది. నాలుగు రోజుల క్రితం కేజీ టమోటా రూ.50 ఉండగా ఇపుడు రూ.70కి చేరింది. మార్కెట్కు వచ్చే టమోటా లోడ్ల సంఖ్య తగ్గింద కర్నూలు మార్కెట్ హోల్సేల్ వ్యాపారులు అంటున్నారు. బుధవారం 42 లారీలు మాత్రమే వచ్చాయి. దీంతో ఒక బాక్స్ టమోటాల ధర రూ.500 నుంచి రూ.700గా విక్రయించారు. ఇప్పటికే దక్షిణాది జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఆ జిల్లాల్లో టమోటాల ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో అక్కడి వ్యాపారులు పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి టమోటాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఈ రాష్ట్రాల నుంచి కర్నూలు, చిత్తూరు, కర్నాటకలోని కోయంబేడు మార్కెట్కు వచ్చే టమోటా లోడ్లు బాగా తగ్గిన కారణంగానే ధర పెరిగిందన్నారు.