Andhra Pradesh: చంద్రగిరిలో యువతి మృతి కేసులో వెలుగులోకి సంచలన విషయం.. మేనమామే ఆ యువతిని..

తిరుపతి జిల్లా చంద్రగిరిలో యువతి అనుమానాస్పద మృతి కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రేమ వ్యవహారం కారణంగానే యువతిని మేనమామ హత్య..

Andhra Pradesh: చంద్రగిరిలో యువతి మృతి కేసులో వెలుగులోకి సంచలన విషయం.. మేనమామే ఆ యువతిని..
Suspect
Follow us

|

Updated on: Dec 02, 2022 | 3:45 PM

తిరుపతి జిల్లా చంద్రగిరిలో యువతి అనుమానాస్పద మృతి కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రేమ వ్యవహారం కారణంగానే యువతిని మేనమామ హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పలు ఆధారాలను ఇప్పటికే సేకరించారు పోలీసులు. యువతి చనిపోయి నెలలు గడుస్తున్నా.. ఆమె మృతి కారణాలు ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి. యువతి మోహనకృష్ణ.. వికాస్ అనే యువకుడిని ప్రేమించింది. అయితే, ఈ విషయంలో యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు ఆగ్రహించారు. ఈ క్రమంలోనే యువతి మోహనకృష్ణను ఆమె మేనమామ తీవ్రంగా మందలించాడు. మేనమామ వార్నింగ్ తరువాత యువతి తన ప్రియుడైన వికాస్ దగ్గరికి వెళ్లిపోయింది.

దాంతో యువతి కోసం ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలించి చివరికి పట్టుకున్నారు. ఇద్దరివీ వేర్వేరు కులాలు కావడంతో.. మోహనకృష్ణను వికాస్ వద్ద నుంచి ఇంటికి తీసుకువచ్చారు. ఆ తరువాత యువతిని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆమె వినడంతో కుటుంబ సభ్యులు మరింత ఆగ్రహానికి లోనయ్యారు. ఈ క్రమంలోనే యువతి మేనమామ ఆమెను గొంతు నులిమి చంపినట్లు భావిస్తున్నా పోలీసులు. అంతేకాదు.. స్థానికులు సైతం అమ్మాయి మేనమామే ఈ హత్య చేసి ఉండాటని చర్చించుకుంటున్నారు. యువతికి తల్లిదండ్రులు లేకపోవడంతో మేనమామ దగ్గరే ఉంటోంది. ఈ క్రమంలో వేరే కులం వ్యక్తిని ప్రేమించిందనే కారణంతో హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

గత ఆగస్టులోనే యువతి మృతికి సంబంధించి పోస్టుమార్టం నివేదిక వచ్చింది. క్వశ్చనరీ నిన్న వచ్చింది. దీని ప్రకారం పోలీసులు విచారణలో స్పీడ్ పెంచారు. నిందితులకు త్వరలోనే శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..