కాలువలోకి దూసుకెళ్లిన బైక్… ముగ్గురు మృతి
తూర్పుగోదావరి జిల్లా మల్కిపురం మండలం గుడిమెల్లంక వద్ద విషాదం చోటుచేసుకుంది. గోదావరి కాలువలోకి ఓ పల్సర్ బైక్ దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. ఒకే బైక్పై ఐదుగురు ప్రయాణిస్తుండగా.. అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని.. ఇద్దరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పాలకొల్లు నుంచి పెదలంక గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తుండగా.. అదుపు తప్పి కాలువలో […]
తూర్పుగోదావరి జిల్లా మల్కిపురం మండలం గుడిమెల్లంక వద్ద విషాదం చోటుచేసుకుంది. గోదావరి కాలువలోకి ఓ పల్సర్ బైక్ దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. ఒకే బైక్పై ఐదుగురు ప్రయాణిస్తుండగా.. అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని.. ఇద్దరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పాలకొల్లు నుంచి పెదలంక గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తుండగా.. అదుపు తప్పి కాలువలో పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. గాయాలతో బయటపడ్డ వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.