Ramatheertham: రామతీర్థం విగ్రహాల పునఃప్రతిష్టాపనలో కీలక ఘట్టం.. ఆలయంలో ప్రత్యేక హోమం నిర్వహించిన అధికారులు..

Ramatheertham: విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీ కోదండ రామస్వామి విగ్రహాల పుననఃప్రతిష్ఠకు ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేస్తోంది.

Ramatheertham: రామతీర్థం విగ్రహాల పునఃప్రతిష్టాపనలో కీలక ఘట్టం.. ఆలయంలో ప్రత్యేక హోమం నిర్వహించిన అధికారులు..
Follow us

|

Updated on: Jan 18, 2021 | 2:08 PM

Ramatheertham: విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీ కోదండ రామస్వామి విగ్రహాల పుననఃప్రతిష్ఠకు ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా సోమవారం నాడు ఆగమశాస్త్రం ప్రకారం వేదపండితుల ఆధ్వర్యంలో పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాలను దేవాదాయశాఖ ప్రారంభి దగ్గరుండి పర్యవేక్షించనుంది. కాగా, విజయనగరం జిల్లాలో రామతీర్థం క్షేత్రంలో గల రామస్వామి విగ్రహ ధ్వంసం ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఓ వైపు భక్తులు, మరోవైపు రాజకీయ పార్టీలు చేసిన ఆందోళనలతో రాష్ట్రం అట్టుడుకిపోయింది. దాంతో ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఓవైపు ఘటనకు బాధ్యులను పట్టుకునే చర్యలు చేపడుతూనే.. మరోవైపు ధ్వంసానికి గురైన విగ్రహాల స్థానంలో విగ్రహాల పునఃప్రతిష్ఠకు ఏర్పాటు చేస్తోంది. ముందుగా ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ ప్రతిష్టకు పనులు ముమ్మరం చేశారు.

విగ్రహాల పునః ప్రతిష్టకు ముందు చేపట్టాల్సిన పనులు ప్రారంభించేందుకు దేవదాయ శాఖ అధికారులు ఆలయంలో ప్రత్యేక హోమం నిర్వహించారు. హోమం పూర్తైన తర్వాత సాంప్రదాయ బద్ధంగా ఆలయంలోని దేవతామూర్తుల విగ్రహాలను బాలాలయంలో ప్రతిష్ఠిస్తారు. ఆలయ ఆధునికీకరణలో భాగంగా గర్భాలయాన్ని కదిలించకూడదని అధికారులు భావిస్తున్నారు. పురాతన కాలంలో నిర్మించినా ఇప్పటికీ పటిష్టంగానే ఉండటంతో గర్భాలయ గోడలను అలానే ఉంచుతూ లోపలి భాగాన్ని మాత్రమే పూర్తిగా ఆధుణీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆలయంలో గర్భాలయం ముందు భాగాన ఉన్న మండపం, భక్తులు ప్రదక్షిణలు చేసే ప్రాకారాలను పూర్తిస్థాయిలో పునర్నిర్మించనున్నారు. కొండపై జరిగే అభివృద్ధి పనులకు సరిపడా నీరు అందుబాటులో ఉంచేందుకు దేవాదాయశాఖ యుద్ధప్రాతిపదికన వాటర్ ట్యాంక్‌ను ఏర్పాటు చేస్తోంది. ఆలయంతో పాటు రామతీర్థం కొండ మెట్లమార్గాన్ని కూడా విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. భక్తులు కొండపైకి సులభంగా చేరుకునేందుకు మెట్ల మార్గాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక కొండపైనున్న ఆలయానికి ఆనుకుని ఉన్న కోనేరును కూడా పూర్తిస్థాయిలో ఆధునికీకరించనున్నారు.

ఇదిలాఉంటే.. రామతీర్థం ఆలయంలో ప్రతిష్ఠించేందుకై శ్రీరామచంద్రుడి మూలవిరాట్‌తో పాటు సీతమ్మ, లక్ష్మణుడి విగ్రహాలను టీటీడీ శిల్పులు రూపొందిస్తున్నారు. ఈనెల 23నాటికి విగ్రహాలను శిల్పులు దేవాదాయశాఖ అధికారులకు అప్పగించనున్నారు. రామతీర్థం ఆలయ ఆధునికీకరణ, నూతన విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమాల పర్యవేక్షణకు దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ భ్రమరాంభను ప్రత్యేక అధికారిగా ప్రభుత్వం నియమించింది. విగ్రహా ప్రతిష్ట, ఆలయ నిర్మాణం, ఆగమశాస్త్రం ప్రకారం జరగాల్సిన పనులు దేవాదాయశాఖ ఎలాంటి లోటుపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Also read:

MLA Prasanna Kumar: నెల్లూరు ఎస్పీ భాస్కర్ భూషణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి

Brutal Murder in Prakasam: యువకుడి దారుణ హత్య.. గొంతు కోసి చంపేశారు.. ఘటనకు సంబంధించి కారణాలు ఇలా..

సూర్యుడితో మచ్చికలు ఆడుతున్న ఈ వయ్యారి.. ఇప్పుడు కుర్రాళ్లకు.!
సూర్యుడితో మచ్చికలు ఆడుతున్న ఈ వయ్యారి.. ఇప్పుడు కుర్రాళ్లకు.!
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆర్జిత సేవా, దర్శన టికెట్లు
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆర్జిత సేవా, దర్శన టికెట్లు
270 సార్లు ట్రాఫిక్‌రూల్స్‌ ఉల్లంఘన..దిమ్మతిరిగే షాకిచ్చిన ఖాకీలు
270 సార్లు ట్రాఫిక్‌రూల్స్‌ ఉల్లంఘన..దిమ్మతిరిగే షాకిచ్చిన ఖాకీలు
వార్ 2 నుంచి ఫోటోలు లీక్.. ఎన్టీఆర్ లుక్ ఇరగదీశాడుగా..!
వార్ 2 నుంచి ఫోటోలు లీక్.. ఎన్టీఆర్ లుక్ ఇరగదీశాడుగా..!
పర్పుల్ క్యాప్‌లో దూసుకొస్తోన్న స్పిన్ సంచలనం..
పర్పుల్ క్యాప్‌లో దూసుకొస్తోన్న స్పిన్ సంచలనం..
దెబ్బేసిన ధోని శిష్యుడు.. టీ20 వరల్డ్‌కప్‌లో రింకూ‌కి నో ప్లేస్.!
దెబ్బేసిన ధోని శిష్యుడు.. టీ20 వరల్డ్‌కప్‌లో రింకూ‌కి నో ప్లేస్.!
లేటెస్ట్ అండ్ హాటెస్ట్.. 2024లో లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్లు ఇవే..
లేటెస్ట్ అండ్ హాటెస్ట్.. 2024లో లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్లు ఇవే..
ప్లేఆఫ్స్‌‌లో ప్లేస్ ఫిక్స్ చేసుకున్న మూడు జట్లు..
ప్లేఆఫ్స్‌‌లో ప్లేస్ ఫిక్స్ చేసుకున్న మూడు జట్లు..
మాటలు జాగ్రత్త.. నభా నటేష్‌కు ఇచ్చిపడేసిన ప్రియదర్శి
మాటలు జాగ్రత్త.. నభా నటేష్‌కు ఇచ్చిపడేసిన ప్రియదర్శి
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు