కీచక టీచర్‌కు దేహశుద్ధి.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు..!

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారుతున్నారు. అభంశుభం తెలియని విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా.. అనంతపురం జిల్లాలో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్‌కు తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని రాజీవ్‌గాంధీ మున్సిపల్ ఉర్దూ పాఠశాలలో విద్యార్థినులను పీటీ టీచర్ వేధింపులకు గురి చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ప్రత్యేక శిక్షణా తరగతులు ఉన్నాయంటూ విద్యార్థినులను పాఠశాలకు రప్పించుకొని వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. […]

కీచక టీచర్‌కు దేహశుద్ధి.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు..!
Follow us

| Edited By:

Updated on: Jul 31, 2019 | 5:01 PM

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారుతున్నారు. అభంశుభం తెలియని విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా.. అనంతపురం జిల్లాలో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్‌కు తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని రాజీవ్‌గాంధీ మున్సిపల్ ఉర్దూ పాఠశాలలో విద్యార్థినులను పీటీ టీచర్ వేధింపులకు గురి చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ప్రత్యేక శిక్షణా తరగతులు ఉన్నాయంటూ విద్యార్థినులను పాఠశాలకు రప్పించుకొని వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో.. వారు ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో.. ఆ పీటీ ఉపాధ్యాయుడిని చితకబాదారు. అతనిపై వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై మండల విద్యాశాఖాధికారికి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.