టీడీపీ గెలుపు ఖాయం: గోరంట్ల
ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధీమా వ్యక్తంచేశారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ తీరుపై తొలిరోజు జరిగిన సమీక్షా సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా గోరంట్ల మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీకి సానుకూల పరిస్థితులు ఉన్నాయని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సీఎం చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. కేంద్ర సహకారం లేకపోయినా పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం చేపట్టారని, పరిశ్రమలు సైతం తీసుకొచ్చారని […]
ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధీమా వ్యక్తంచేశారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ తీరుపై తొలిరోజు జరిగిన సమీక్షా సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా గోరంట్ల మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీకి సానుకూల పరిస్థితులు ఉన్నాయని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సీఎం చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. కేంద్ర సహకారం లేకపోయినా పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం చేపట్టారని, పరిశ్రమలు సైతం తీసుకొచ్చారని తెలిపారు. ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఉంటే మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటల వరకు ఓటర్లెవరూ క్యూలైన్లలో వేచి ఉండరని అభిప్రాయపడ్డారు. తమ నేత చంద్రబాబును మళ్లీ తెచ్చుకోవాలన్న ఉద్దేశంతోనే ఓట్లు వేశారని వివరించారు.