Visakha Steel Plant: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ పరరిక్షణ పోరాట యాత్ర.. పాల్గొననున్న ప్రముఖులు..
Visakha Steel Plant Privatisation: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శనివారం ఇవాళ వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో..
Visakha Steel Plant Privatisation: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శనివారం ఇవాళ వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర చేపట్టనున్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్, డైమండ్ పార్క్, దొండపర్తి, మర్రిపాలెం, ఎన్ఏడీ జంక్షన్, ఎయిర్ పోర్ట్, షీలానగర్ మీదుగా స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. దాదాపు 25 కిలోమీటర్లు ఈ పాదయాత్రను చేపట్టనున్నారు.
పాదయాత్ర అనంతరం కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద బహిరంగ సభ నిర్వహిస్తారు. కాగా, ఈ పాదయాత్రలో విజయసాయిరెడ్డితో పాటు వైసీపీకి చెందిన ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు, విద్యార్థి, కార్మిక సంఘాలు పాల్గొననున్నారు. ఇదిలాఉండగా.. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించొద్దంటూ స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ చేపట్టిన రీలే నిరాహార దీక్షలు 8వ రోజుకు చేరాయి.
Also read:
TV9 Exclusive Video: అందంగా ఉన్న యువతిని ఉద్యోగం నుంచి తొలగింపు