Andhra Pradesh: గుంటూరు జిల్లాలో మరో పైశాచికం.. వైద్య విద్యార్థినిపై సర్జికల్ బ్లేడ్‌తో దాడి..

గుంటూరు ‌జిల్లా తక్కెళ్లపాడులో దారుణం జరిగింది. వైద్య విద్య అభ్యసిస్తున్న తపశ్వి పై ఓ యువకుడు సర్జికల్ బ్లేడ్ తో దాడి చేయడంతో మృతి చెందిది...తపస్విపై విజయవాడలోని వైద్య కళాశాలలో చదువుతోంది. ఇన్ స్టాగ్రామ్ ద్వారా..

Andhra Pradesh: గుంటూరు జిల్లాలో మరో పైశాచికం.. వైద్య విద్యార్థినిపై సర్జికల్ బ్లేడ్‌తో దాడి..
Accused Jnaneswar
Follow us

|

Updated on: Dec 06, 2022 | 8:55 AM

గుంటూరు ‌జిల్లా తక్కెళ్లపాడులో దారుణం జరిగింది. వైద్య విద్య అభ్యసిస్తున్న తపశ్వి పై ఓ యువకుడు సర్జికల్ బ్లేడ్ తో దాడి చేయడంతో మృతి చెందిది…తపస్విపై విజయవాడలోని వైద్య కళాశాలలో చదువుతోంది. ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయిన జ్ఞానేశ్వర్‌ హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. రెండు సంవత్సరాల‌ పాటు వీరిద్దరు స్నేహంగా మెలిగారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో గతంలో జ్ఞానేశ్వర్ పై విజయవాడ పోలీసులకు తపస్వి పిర్యాదు చేసింది. తనపై పోలీసులకు పిర్యాదు చేసిందని తెలియడంతో జ్ఞానేశ్వర్ తపస్విపై కక్ష పెంచు కున్నాడు. తక్కెళ్లపాడులోని తన స్నేహితురాలు వద్ద ఉన్న తపశ్విపై జ్ఞానేశ్వర్ దాడికి పాల్పడ్డాడు. తనతో తెచ్చుకున్న సర్జికల్ బ్లేడ్ తో గొంతు కోసాడు…అనంతరం తాను కూడా చేయి కోసుకున్నాడు. కుప్పకూలి పోయిన తపశ్విని చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మద్యలో మృతి చెందింది. నిందితుడు జ్ఞానేశ్వర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాపశ్వి మృత దేహన్ని పోస్టుమార్టం కోసం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు.

విజయవాడకు చెందిన జ్ఞానేశ్వర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం తపస్వితో పరిచయం ఏర్పడింది. ఇటీవల వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. తక్కెళ్లపాడులోని ఓ డెంటర్ కాలేజీలో చదువుతున్న తపస్వి స్నేహితురాలు వీరిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు తన వద్దకు రమ్మని పిలిచింది. దీంతో వారం రోజులుగా తపస్వి తన స్నేహితురాలి వద్ద ఉంటుంది. తపస్విపై పగపెంచుకున్న జ్ఞానేశ్వర్‌ ఆమెను హతమర్చాలని నిర్ణయించుకున్నాడు.

సోమవారం తపస్వి స్నేహితురాలు ఇద్దరికీ రాజీ కుదిర్చే ప్రయత్నం చేయగా ఆ సమయంలో అతడు ఉన్మాదిలా మారిపోయి తపస్విపై దాడి చేసి సర్జికల్‌ బ్లేడ్‌తో గొంతు కోశాడు. పక్కనున్న తపస్వి స్నేహితురాలు కేకలు వేసి బయటకు పరిగెట్టడంతో స్థానికులు వచ్చారు. దీంతో తలుపులు మూసేసి కొనఊపిరితో ఉన్న తపస్విని రక్తపు మడుగులో ఓ గది నుంచి మరో గదికి ఈడ్చుకుంటూ తీసుకెళ్లాడు. స్థానికులు తలుపులు పగులగొట్టి తపస్విని ఆసుపత్రికి తరలించారు. తపస్వీని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయిందని నిర్ధారించారు. నిందితుడిని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..