జైపూర్ షుగర్స్లో విషనాగుల సంచారం!
అదో తియ్యటి చక్కర కర్మాగారం.. కానీ, అక్కడ తిరిగేవి మాత్రం అన్ని కాలకూట విషనాగులే. అది ఎక్కడో కాదు.. పశ్చిమగోదావరి జిల్లాలోని చాగల్లు జైపూర్ షుగర్ ఫ్యాక్టరీలో తరచూ కనిపిస్తున్న విషసర్పాలతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. చాగల్లు జైపూర్ షుగర్ ఫ్యాక్టరీలో చాలవరకు కొండచిలువలు, ప్రమాదకరమైన నాగు పాములు సంచరిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఫ్యాక్టరీ మూసివేసి ఉండడంతో ఫ్యాక్టరీలోనూ, ఫ్యాక్టరీ ఆవరణలోనూ చెట్లు, తుప్పలు విపరీతంగా పెరిగిపోయాయి. కార్మికులతో నిత్యం సందడిగా ఉండే షుగర్ ఫ్యాక్టరీ నేడు విష […]
అదో తియ్యటి చక్కర కర్మాగారం.. కానీ, అక్కడ తిరిగేవి మాత్రం అన్ని కాలకూట విషనాగులే. అది ఎక్కడో కాదు.. పశ్చిమగోదావరి జిల్లాలోని చాగల్లు జైపూర్ షుగర్ ఫ్యాక్టరీలో తరచూ కనిపిస్తున్న విషసర్పాలతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు.
చాగల్లు జైపూర్ షుగర్ ఫ్యాక్టరీలో చాలవరకు కొండచిలువలు, ప్రమాదకరమైన నాగు పాములు సంచరిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఫ్యాక్టరీ మూసివేసి ఉండడంతో ఫ్యాక్టరీలోనూ, ఫ్యాక్టరీ ఆవరణలోనూ చెట్లు, తుప్పలు విపరీతంగా పెరిగిపోయాయి. కార్మికులతో నిత్యం సందడిగా ఉండే షుగర్ ఫ్యాక్టరీ నేడు విష జంతువులకు అసాంఘిక కార్యక్రమాలకు నెలవుగా మారిపోయిందంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల దాదాపు 10 అడుగుల పొడవైన కొండచిలువ రోడ్డుకు అడ్డంగా వచ్చి వాహనదారులను పాదచారులను భయబ్రాంతులకు గురి చేసింది. ఫ్యాక్టరీ సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి కొండచిలువను హతమార్చారు. కాగా గత కొంతకాలంగా తరచుగా ఇలా విష సర్పాలు రావడం ఈ నెలలో ఇలా కొండచిలువను చంపడం నాలుగవసారి అని స్థానికులు వాపోతున్నారు. దీంతో ఫ్యాక్టరీ పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత కొంతకాలంగా తరచుగా ఇలా విష సర్పాలు వస్తున్నాయంటూ కార్మికులు భయాందోళన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ పరిసర ప్రాంత ప్రజలు సైతం బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు.