ఉల్లి పాట్లు.. సిగపట్లు

ప్రజలకు ఉల్లి కష్టాలు తీరటం లేదు. ఏపీలో ఉల్లి కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం పలుచోట్ల సబ్సిడీ కేంద్రాలను ఏర్పాటు చేసి కిలో ఉల్లిని 25 రూపాయలకే అందజేస్తోంది. దీంతో రైతు బజార్ల వద్ద రోజురోజుకు ఉల్లి గడ్డల కోసం వచ్చే వారి క్యూ పెరిగిపోతూనే ఉంది. ఉల్లిగడ్డల కోసం ప్రజలు తెల్లవారుజామునా 3 గంటల నుంచే క్యూలైన్లలో బారులు తీరి నిల్చుంటున్నారు. సబ్సిడీ ఉల్లికోసం విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఉల్లిసెంటర్‌ వద్ద […]

ఉల్లి పాట్లు.. సిగపట్లు
Follow us

|

Updated on: Dec 14, 2019 | 4:05 PM

ప్రజలకు ఉల్లి కష్టాలు తీరటం లేదు. ఏపీలో ఉల్లి కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం పలుచోట్ల సబ్సిడీ కేంద్రాలను ఏర్పాటు చేసి కిలో ఉల్లిని 25 రూపాయలకే అందజేస్తోంది. దీంతో రైతు బజార్ల వద్ద రోజురోజుకు ఉల్లి గడ్డల కోసం వచ్చే వారి క్యూ పెరిగిపోతూనే ఉంది. ఉల్లిగడ్డల కోసం ప్రజలు తెల్లవారుజామునా 3 గంటల నుంచే క్యూలైన్లలో బారులు తీరి నిల్చుంటున్నారు. సబ్సిడీ ఉల్లికోసం విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఉల్లిసెంటర్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పార్వతీపురం రైతుబజారకు తెల్లవారుజాము నుంచే వినియోగదారులు క్యూ కట్టారు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా రైతు బజార్‌ వద్ద బారులు తీరారు. ఒక్కసారిగా రైతు బజార్‌ గేట్‌ తీయడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో కొంతమంది వృద్దులు, మహిళలు కిందపడ్డారు. మేము ముందు వచ్చామంటే మేమేనంటూ ..గుంపులుగా చేరిన జనాలు ఒక్కసారిగా ఎగబడడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. కొంతమంది మహిళలు సిగలు పట్టుకుని కొట్టుకున్నారు. మహిళలు, పురుషులు కూడా ఎటువంటి క్యూలైన్‌ పద్దతి పాటించకపోవటంతో పరిస్థితి అదుపు తప్పింది. మరోవైపు గత నాలుగు రోజులుగా ఉల్లి సరఫరా జరక్కపోవడంతో.. శనివారం రైతు బజార్‌కు జనాలు పోటెత్తారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండు కౌంటర్లు ఏర్పాటు చేసి ఉల్లి సరఫరా చేస్తున్నారు అధికారులు. సరిపడా సరుకు అందుబాటులోకి తీసుకొచ్చి.. ధరలు తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు.