Andhra Pradesh: సాధారణ తనిఖీలు.. కారు ఆపి చెక్ చేస్తోన్న పోలీసులు.. తత్తరపాటుతో వ్యక్తి.. కట్ చేస్తే..
రాయలసీమ జిల్లాలో ఇల్లీగల్ లిక్కర్కు పోలీసులు చెక్ పెడుతున్నారు. చిత్తూరు, కర్నూలు జిల్లాలో అంతరాష్ట్ర మద్యం స్మగ్లర్లను పట్టుకుని భారీ షాక్ ఇచ్చారు.
అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని చిత్తూరు పోలీసులు సీజ్ చేశారు. పక్కా సమాచారంతో దాడులు చేసి రూ. 9లక్షల విలువచేసే ఇల్లీగల్ లిక్కర్, రూ. 16లక్షల విలువ గల కార్లను, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరులోని జింకల పార్కు వద్ద అనుమానాస్పద ఉన్న వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. మూడు వాహనాల్లో కర్ణాటక అక్రమ మద్యాన్ని గుర్తించి నలుగురు అంతర్రాష్ట్ర మద్యం స్మగ్లర్లు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరు మాజీ హోం గార్డ్ కుమరేషన్, మరో ముగ్గురు ఐరాలకు చెందిన మధుసూదన్ రెడ్డి, కర్ణాటక కేజిఎఫ్ కు చెందిన మురళి, చిత్తూరుకు చెందిన రమేష్లుగా గుర్తించారు. నిందితులను రిమాండ్కు తరలించారు.
మరోవైపు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సెబ్ పరిధిలో ఇల్లీగల్ మద్యం పట్టుబడింది. అక్రమ మద్యాన్ని రవాణా చేస్తున్న వాహనాలను మాధవరం చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు తనీఖీ చేసి పట్టుకున్నారు. కారులో అక్రమ మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 20 బాక్స్ల మద్యం, సెల్ ఫోన్, కారును స్వాదీనం చేసుకున్నారు. పట్టుపడ్డ మద్యం విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని సెబ్ సీఐ జయరాం నాయుడు తెలిపారు.