గోదావరి లాంచీ ప్రమాదంలో అనూహ్య పరిణామం..ఆ డెడ్బాడీలు వారివేనా?
తూర్పుగోదావరి జిల్లాలోని కచ్చులూరు వద్ద లాంచీ ప్రమాదం జరిగి 20 రోజులవుతుంది. లాంచీని పైకి తీసేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. మరోవైపు మృతదేహాలు దొరకనివారికి వారి కుటుంబీకులు కర్మకాండలు చేస్తున్నారు. మరికొందరు తమవారిని చివరిచూపు దొరుకుతుందేమో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికీ గల్లైంతన 15 మంది మృతదేహాల జాడలేదు. ఈ క్రమంలో శుక్రవారం తూర్పుగోదావరి జల్లా ఆత్రేయపురం మండలం పిచ్చికలంక సమీపంలోని కాటన్ బ్యారేజ్ వద్ద మృతదేహాలు లభ్యమయ్యాయి. బ్యారేజ్ 23వ గేట్ వద్దకు కొట్టుకొచ్చిన 3 మృతదేహాలను […]
తూర్పుగోదావరి జిల్లాలోని కచ్చులూరు వద్ద లాంచీ ప్రమాదం జరిగి 20 రోజులవుతుంది. లాంచీని పైకి తీసేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. మరోవైపు మృతదేహాలు దొరకనివారికి వారి కుటుంబీకులు కర్మకాండలు చేస్తున్నారు. మరికొందరు తమవారిని చివరిచూపు దొరుకుతుందేమో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికీ గల్లైంతన 15 మంది మృతదేహాల జాడలేదు. ఈ క్రమంలో శుక్రవారం తూర్పుగోదావరి జల్లా ఆత్రేయపురం మండలం పిచ్చికలంక సమీపంలోని కాటన్ బ్యారేజ్ వద్ద మృతదేహాలు లభ్యమయ్యాయి. బ్యారేజ్ 23వ గేట్ వద్దకు కొట్టుకొచ్చిన 3 మృతదేహాలను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీయించారు. గోదావరి లాంచీ ప్రమాద మృతులై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. డీఎన్ఏ పరీక్షల కోసం డెడ్బాడీలను ల్యాబ్కు పంపిస్తామని తెలిపారు. లాంచీని వెలికి తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న తరుణంలోనే వర్షాలతో గోదావరిలో నీటి ఉధృతి ఎక్కువైంది. దీంతో వెలికితీత పనులు ఐదో రోజు నిలిచిపోయాయి. కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం, శివ సహకారంతో లాంచీని పైకి తెచ్చేందుకు వివిధ కోణాల్లో చేసిన ప్రయత్నాలు విఫలం అయిన సంగతి తెలిసిందే.