Krishna district: ’10 రోజుల్లో చనిపోతే ఇక్కడ బొంద పెట్టండి.. 3 రోజుల్లో లేచొస్తా..’ పాస్టర్ వింత ప్రవర్తన
ఇలాంటి పాస్టర్స్ వద్దకు ప్రార్థనలకు వెళ్తే.. ఈయనగారి స్పీచ్లు వింటే.. భక్తులు కూడా అపనమ్మకాలవైపు మళ్లే ప్రమాదం ఉంది.
టెక్నాలజీలో దూసుకుపోతున్నా మూఢనమ్మకాలు మాత్రం వీడటం లేదు కొందరు. మహమ్మారి కరోనా మెడిసిన్ కనిపెట్టాం.. కానీ మూర్ఖత్వ జాఢ్యాలకు మాత్రం మందు కనిపెట్టలేకపోతున్నాం. ఇప్పటికే చేతబడులు, బాణామతులు, నరబలులు, లంకెబిందెలు, రైస్పుల్లింగులు, క్షుద్రపూజలు, దెయ్యాలకు సంబంధించిన ఘటనలు రోజూ ఏదే మూలన వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా కృష్ణా జిల్లా గన్నవరంలో ఓ పాస్టర్ వింత ప్రవర్తన స్థానికులను షాక్కు గురి చేస్తోంది.
10 రోజుల్లో తాను చనిపోయి సమాధి నుంచి మళ్లీ తిరిగొస్తా అంటూ ఫ్లెక్సీలు కట్టించుకున్నాడు పాస్టర్ నాగభూషణం. అంతేకాదు గొల్లనపల్లిలోని తన స్థలంలో సమాధి కోసం గొయ్యిని కూడా తవ్వించుకున్నాడు. 10 రోజుల్లో తాను చనిపోతే ఇదే సమాధిలో పెట్టాలని..మళ్లీ 3 రోజుల్లో బ్రతికి వస్తా అంటూ కుటుంబసభ్యులకు, గ్రామస్తులకు చెబుతున్నాడు. ఆయన వైఖరితో అటు కుటుంబసభ్యులు, ఇటు గ్రామస్తులు కంగారు పడుతున్నారు. అసలు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
ఇలాంటి పాస్టర్స్ ప్రజలను కూడా అపనమ్మకాలవైపు నడిపిస్తారని.. జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు అంటున్నారు. ముందు ఇతగాడికి కౌన్సిలింగ్ ఇప్పించాలని.. మారని పక్షంలో మానసిక వికలాంగుల సంరక్షణ శాలకు తరలించి.. చికిత్స అందించాలంటున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..