Andhra Pradesh: పేపర్ బాయ్ గా మారిన ఎమ్మెల్యే.. సైకిల్ పై ఇంటింటికి తిరుగుతూ.. కారణమేంటంటే
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే వినూత్న అవతారం ఎత్తారు. ఇంటింటికీ పేపర్లు వేసుకుంటూ వెరైటీ నిరసన చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు (Palakollu) శాసనసభసభ్యుడు నిమ్మల రామానాయుడు పేపర్ బాయ్ గా మారారు....
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే వినూత్న అవతారం ఎత్తారు. ఇంటింటికీ పేపర్లు వేసుకుంటూ వెరైటీ నిరసన చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు (Palakollu) శాసనసభసభ్యుడు నిమ్మల రామానాయుడు పేపర్ బాయ్ గా మారారు. టిడ్కో ఇళ్ల పనులు పూర్తి చేసి, లబ్ధిదారులకు ఇవ్వడానికి ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందని ప్రశ్నించారు. అర్హులకు వెంటనే లబ్ధి కలిగించాలని డిమాండ్ చేస్తూ పేపర్ బాయ్ లా మారారు. ఆదివారం తెల్లవారుజామున పట్టణంలోని మావూళ్లమ్మపేటకు చేరుకున్న ఎమ్మెల్యే స్థానిక పేపర్ బాయ్స్తో కలిసి సైకిల్ పై ఇంటింటికీ వెళ్లి చందాదారులకు పేపర్లు పంపిణీ చేశారు. 31వ వార్డులోని నాగరాజుపేట సహా పలు ప్రాంతాల్లో పేపర్ వేశారు. దినపత్రిక తీసుకునేందుకు వచ్చిన వారికి.. టిడ్కో ఇళ్లపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వివరించారు. పట్టణవాసులకు పది కిలోమీటర్ల దూరంలో టిడ్కో ఇళ్లు కేటాయించడాన్ని ప్రశ్నించారు.
#ఇంటింటికి సైకిల్ పై పేపర్ వేస్తు నిరసన వ్యక్తం చేస్తున్న డా.నిమ్మల ఇల్లు, ఇళ్ల స్థలాల పేరు చెప్పి మహిళలు, పేదలను దగా, మోసం చేస్తున్న జగన్ ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు మావుళ్ళమ్మ పేట, నాగరాజుపేటలలో ఇంటింటికి సైకిల్ పై తిరిగి పేపర్లు వేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది.. pic.twitter.com/MPToIiifzL
ఇవి కూడా చదవండి— Nimmala Ramanaidu (@RamanaiduTDP) July 31, 2022
అంతే కాకుండా ప్రతి నెలా నాలుగు రోజులు ఇలా పేపర్లు వేసుకుంటూ చందాదారులను కలిసి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల గురించి తెలియజేస్తానని చెప్పారు. మరో నాలుగు రోజుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి నిరసన తెలుపుతానని తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్యే పేపర్లు వేస్తున్న వీడియో వైరల్ గా మారింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి