దివ్యాంగుల శిబిరంలో వృద్దుడు మృతి

కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దివ్యాంగుల శిబిరంలో ప్రమాదవశాత్తు కిందపడి ఓ వృద్దుడు ప్రాణాలు కొల్పోయాడు. జిల్లాలోని కోడుమూరు పట్టణంలో దివ్యాంగులకు ట్రైసైకిల్‌ అందజేసేందుకు గానూ కిష్టాపూర్‌ గ్రామంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న చాలా మంది దివ్యాంగులు ట్రైసైకిల్‌ కోసం వచ్చారు. ఈ క్రమంలోనే క్రిష్ణపురం గ్రామానికి చెందిన కామెశ్వర రెడ్డి అనే వృద్దుడు మెట్లమీదనుండి జారిపడి అక్కడికక్కడే ప్రాణాలు కొల్పోయాడు. జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న […]

దివ్యాంగుల శిబిరంలో వృద్దుడు మృతి
Follow us

|

Updated on: Sep 18, 2019 | 8:40 PM

కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దివ్యాంగుల శిబిరంలో ప్రమాదవశాత్తు కిందపడి ఓ వృద్దుడు ప్రాణాలు కొల్పోయాడు. జిల్లాలోని కోడుమూరు పట్టణంలో దివ్యాంగులకు ట్రైసైకిల్‌ అందజేసేందుకు గానూ కిష్టాపూర్‌ గ్రామంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న చాలా మంది దివ్యాంగులు ట్రైసైకిల్‌ కోసం వచ్చారు. ఈ క్రమంలోనే క్రిష్ణపురం గ్రామానికి చెందిన కామెశ్వర రెడ్డి అనే వృద్దుడు మెట్లమీదనుండి జారిపడి అక్కడికక్కడే ప్రాణాలు కొల్పోయాడు. జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు..సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.