పార్టీలు విజయోత్సవాలను నిర్వహించరాదు: సీపీ
ఓట్ల లెక్కింపు రోజున విజయోత్సవ ర్యాలీలకు ఎలాంటి అనుమతులు లేవని విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. ఏవైనా హింసాత్మక సంఘటనలు జరుగుతాయన్న ఉద్దేశంతో అనుమానితులను ఇప్పటికే బైండోవర్ చేసినట్టు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించినట్టు ద్వారకా తిరుమలరావు వివరించారు. ప్రశాంత వాతావరణంలో లెక్కింపు జరిగేలా అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఓట్ల లెక్కింపు రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఐదు పార్కింగ్ […]
ఓట్ల లెక్కింపు రోజున విజయోత్సవ ర్యాలీలకు ఎలాంటి అనుమతులు లేవని విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. ఏవైనా హింసాత్మక సంఘటనలు జరుగుతాయన్న ఉద్దేశంతో అనుమానితులను ఇప్పటికే బైండోవర్ చేసినట్టు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించినట్టు ద్వారకా తిరుమలరావు వివరించారు. ప్రశాంత వాతావరణంలో లెక్కింపు జరిగేలా అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఓట్ల లెక్కింపు రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఐదు పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి కేంద్రం వద్ద పక్కా ప్రణాళికతో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు వివరించారు. లెక్కింపు కేంద్రం లోపల కేంద్ర బలగాలతో బందోబస్తు ఉంటుందని, కేంద్రం వెలుపల పోలీసుల బలగాలు ఉంటాయని సీపీ వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద నాలుగు అంచెల భద్రతను ఏర్పాటు చేశామని ఏపీ డీజీపీ ఠాకూర్ తెలిపారు.