14 రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్… నెల్లూరులో అరెస్ట్!
ఏటీఎం లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠాని నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు.గత కొన్ని సంవత్సరాలుగా ఏటీఎం సెంటర్ లలో స్కిమ్మింగ్ కార్డ్ ల సాయంతో చోరీలకు పాల్పడుతున్నట్లు జిల్లా ఎస్పీ ఐస్వర్య రస్తోగి తెలిపారు. వీరు వృద్ధులు..చదువురాని వారిని టార్గెట్ చేస్తూ ఏటీఎం లలో చోరీకి పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే నెల్లూరు పోలీసులు సందీప్ అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ను అరెస్ట్ చేశారు. హర్యానా రాష్ట్రానికి చెందిన సందీప్ ఆషామాషీ […]
ఏటీఎం లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠాని నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు.గత కొన్ని సంవత్సరాలుగా ఏటీఎం సెంటర్ లలో స్కిమ్మింగ్ కార్డ్ ల సాయంతో చోరీలకు పాల్పడుతున్నట్లు జిల్లా ఎస్పీ ఐస్వర్య రస్తోగి తెలిపారు. వీరు వృద్ధులు..చదువురాని వారిని టార్గెట్ చేస్తూ ఏటీఎం లలో చోరీకి పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
అయితే నెల్లూరు పోలీసులు సందీప్ అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ను అరెస్ట్ చేశారు. హర్యానా రాష్ట్రానికి చెందిన సందీప్ ఆషామాషీ క్రిమినల్ కాదు. ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతున్న సందీప్పై దేశవ్యాప్తంగా 1000 వరకు కేసులున్నాయి. ఏపీలోనే ఏపీలోనే 47 కేసులు నమోదయ్యాయి. సందీప్ను అరెస్ట్ చేయడానికి 14 రాష్ట్రాల పోలీసులు తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. అయితే, ఏపీ పోలీసులు పక్కాగా వలపన్ని ఆ కేటుగాడ్ని పట్టుకున్నారు. నెల్లూరు దర్గామిట్ట ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి ఓ కారు, ఓ ఏటీఎం కార్డు క్లోనింగ్ యంత్రం, రూ.7 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేయడంలో కీలకంగా వ్యవహరించిన టాస్క్ఫోర్స్ సీఐ శ్రీనివాసన్, ఎస్సైలు బాబి, సురేష్కుమార్ రెడ్డిలను జిల్లా ఎస్పీ ఐశ్వర్య అభినందించారు.