పట్టాభిపై దాడి విషయంలో ఆయన్ను విచారించాలి.. తాము తెర వెనక ఉంటే దాడి ఇలా ఉండదన్న గన్నవరం ఎమ్మెల్యే

ఏపీలో పంచాయతీ ఎన్నికలు కాక రేపుతున్నాయి. అధికార ప్రతిపక్షాల నేతలు మాటల యుద్ధం దాటి చేతల దాకా వెళ్తున్నారు. ఇంతకాలం పరస్పరం..

పట్టాభిపై దాడి విషయంలో ఆయన్ను విచారించాలి.. తాము తెర వెనక ఉంటే దాడి ఇలా ఉండదన్న గన్నవరం ఎమ్మెల్యే
vallabhaneni-vamshi
Follow us

|

Updated on: Feb 02, 2021 | 6:14 PM

ఏపీలో పంచాయతీ ఎన్నికలు కాక రేపుతున్నాయి. అధికార ప్రతిపక్షాల నేతలు మాటల యుద్ధం దాటి చేతల దాకా వెళ్తున్నారు. ఇంతకాలం పరస్పరం విమర్శలతో హీట్‌ పెంచిన నేతలు ఇప్పుడు దాడులు చేసుకుంటున్నారు. టీడీపీ సీనియర్‌ నేత పట్టాభి ఇంటిపై దాడి జరగడం సంచలనంగా మారింది. ఈ ఘటనలో పట్టాభికి గాయాలయ్యాయి.

అయితే పట్టాభిపై దాడి వెనుక వైసీపీ హస్తం ఉందని టీడీప నేతలు భగ్గుమంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం చేతగాక ఇలా దాడులకు దిగుతున్నారని విమర్శిస్తున్నారు. దాడి వెనుక మంత్రి కొడాలి నాని హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ బహిష్కృత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు.

టీడీపీ నేత పట్టాభిపై దాడి విషయంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన కామెంట్స్‌ చేశారు. పట్టాభిపై దాడి ఘటనలో నారా లోకేష్‌ని విచారించాలన్నారు వంశీ. స్వగృహ ఫుడ్ విషయంలో లోకేష్‌కి, పట్టాభికి గొడవలు ఉన్నాయన్నారు. తామే తెరవెనుక ఉంటే దాడి ఇలా ఉండదన్నారు వల్లభనేని. ఇక పట్టాభిపై దాడితో తమకు సంబంధం లేదన్నారు వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్‌. అదంతా ఓ డ్రామా అని కొట్టిపారేశారు.

పట్టాభిపై దాడి ఓ డ్రామాగా అభివర్ణించిన కొడాలి నాని.. నమ్ముకున్నవారిని ముంచడం చంద్రబాబుకు అలవాటేనన్న మంత్రి