శ్రీహరికోటలో స్పేస్ సెంటర్లో అగ్నిప్రమాదం
నెల్లూరు జిల్లా శ్రీహరి కోట స్పేస్ సెంటర్ (సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం)లో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఎలక్ట్రిక్ ప్యానెల్ గదులు దగ్ధమయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది..
నెల్లూరు జిల్లా శ్రీహరి కోట స్పేస్ సెంటర్ (సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం)లో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఎలక్ట్రిక్ ప్యానెల్ గదులు దగ్ధమయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే చిన్న ఫైర్ యాక్సిడెంట్ కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. యూపీఎస్లో సాంకేతిక లోపంతో మంటలు చెలరేగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. షార్లోని ఘన ఇందన మోటార్లు తయారుచేసే ఎస్పీపీ విభాగంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. రెండు ఎలక్ట్రికల్ ప్యానల్స్ గదులు దగ్ధమయ్యాయి. బుధవారం 10 గంటలకు సిబ్బంది ప్యానల్స్ను ఆన్చేసి బయటకు వెళ్లారు. ఆ సమయంలో యూపీఎస్ నుంచి మంటలు వ్యాపించినట్లు సమాచారం.
Read More:
వెహికల్ ట్యాక్స్పై స్వల్ప ఊరటనిచ్చిన ఏపీ ప్రభుత్వం