Botsa Satyanarayana: రెండు రాష్ట్రాలు కలిసే ప్రతిపాదన వస్తే మోస్ట్ వెల్ కమ్.. మంత్రి బొత్స క్లారిటీ..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయి ఇప్పటికీ 9 సంవత్సరాలు అవుతోంది. రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి రావడం, వాటి గడువు ముగిసి ఎన్నికలు రావడం, రెండో ప్రభుత్వం...

Botsa Satyanarayana: రెండు రాష్ట్రాలు కలిసే ప్రతిపాదన వస్తే మోస్ట్ వెల్ కమ్.. మంత్రి బొత్స క్లారిటీ..
Botsa Satyanarayana
Follow us

|

Updated on: Dec 08, 2022 | 4:23 PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయి ఇప్పటికీ 9 సంవత్సరాలు అవుతోంది. రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి రావడం, వాటి గడువు ముగిసి ఎన్నికలు రావడం, రెండో ప్రభుత్వం కూడా ఏర్పాటు కావడం చకచకా జరిగిపోయాయి. అయితే ప్రస్తుతం రెండు రాష్ట్రాలు కలిసి ఉంటే తప్పేంటన్న అభిప్రాయం ఏపీ మంత్రులకు వస్తుండటం గమనార్హం. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు సజ్జల చేసిన కామెంట్లకు కొనసాగింపుగా మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రెండు రాష్ట్రాలు కలిసే ప్రతిపాదన వస్తే మోస్ట్ వెల్ కమ్.. తప్పేం ఉంది? రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలనే మేం కోరుకుంటాం.. కానీ ఇవన్నీ ఊహాజనిత ప్రశ్నలు అని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పడం గమనార్హం. నిరాదరణకు గురైన వారిని ఆదుకోవడమే ప్రభుత్వం ఉద్దేశం. టీడీపీ నేతలు మంత్రులపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మంత్రులు ఆయన భుజాలపై చేతులు వేసుకుని తిరిగారా?. టీడీపీ వాళ్ళు అనవసర మాటలు మాట్లాడద్దు. ఏపీ,తెలంగాణ కలిసే పరిస్థితి వస్తే స్వాగతిస్తాం. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో ఉంది. ఒకవేళ వైసీపీని అడిగితే రెండు రాష్ట్రాలు కలవాలని చెప్తాము. రాష్ట్ర విభజన అంశంపై ఇప్పటివరకు పోరాడుతున్నాం. ఉండవల్లి చెప్పింది వేదం కాదు. చట్టం కాదు. చట్ట ప్రకారం ఏపీకి రావాల్సినవన్నీ రావాలి.

– బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ 

మరోవైపు.. సమైక్య రాష్ట్రంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కుదిరితే మళ్లీ ఏపీ ఉమ్మడిగా కలసి ఉండాలన్నదే తమ విధానం అని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం జగన్‌ ఎప్పుడూ ముందుంటారన్న ఆయన.. అందుకోసం వచ్చిన ఏ అవకాశాన్నీ మేం వదులుకోబోమన్నారు. ఆంధ్రప్రదేశ్ మళ్లీ కలవడానికి ఏ వేదిక దొరికినా తమ పార్టీ, తమ ప్రభుత్వం దానికే ఓటు వేస్తుందని ప్రకటించారు. కానీ, ఇప్పుడది సాధ్యమయ్యే పనేనా అని వ్యాఖ్యానించారు సజ్జల. ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలు అసందర్భంగా ఉన్నాయని, కావాలనే సీఎం జగన్‌పై ఆయన కామెంట్స్ చేశారని ఫైర్ అయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..