కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కర్నూలు జిల్లా దేవనకొండ మండలం గద్దెరాళ్ల దగ్గర లారీ బీభత్సం సృష్టించింది. శ్రీశైలం వెళ్తున్న పాదయాత్ర బృందంపై లారీ ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భక్తులు మరణించగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయాలపాలైన వారిని స్థానిక హాస్పిటల్కు తరలించారు. కాగా.. మృతులు పోతులింగా, సేతు, మల్లయ్యగా గుర్తించారు. బ్రేకులు ఫెయిల్ అయిన కారణంగానే లారీ అదుపుతప్పి భక్తులపై దూసుకెళ్లిందని డ్రైవర్ చెప్తున్నాడు.
కర్నూలు జిల్లా దేవనకొండ మండలం గద్దెరాళ్ల దగ్గర లారీ బీభత్సం సృష్టించింది. శ్రీశైలం వెళ్తున్న పాదయాత్ర బృందంపై లారీ ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భక్తులు మరణించగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయాలపాలైన వారిని స్థానిక హాస్పిటల్కు తరలించారు. కాగా.. మృతులు పోతులింగా, సేతు, మల్లయ్యగా గుర్తించారు. బ్రేకులు ఫెయిల్ అయిన కారణంగానే లారీ అదుపుతప్పి భక్తులపై దూసుకెళ్లిందని డ్రైవర్ చెప్తున్నాడు.