Andhra Pradesh: ఏపీ రాజకీయాల్లో ఇదో స్పెషల్ మూమెంట్.. మళ్లీ కలుసుకున్న ఆ ఇద్దరు నేతలు..
Kodali Nani and Vangaveeti Radha: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదో స్పెషల్ మూమెంట్. అవును, చాలా రోజుల తర్వాత మాజీ మంత్రి కొడాలి నాని, వంగవీటి రాధ కలుసుకున్నారు. ఇద్దరూ మిత్రులే..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదో స్పెషల్ మూమెంట్. అవును, చాలా రోజుల తర్వాత మాజీ మంత్రి కొడాలి నాని, వంగవీటి రాధ కలుసుకున్నారు. ఇద్దరూ మిత్రులే.. గతంలోనూ చాలా సార్లు కలిసారు. కానీ ఈసారి రాధా రాక కోసం కొడాలి నానీ అరగంట పాటు వెయిట్ చేశారు. రాధా రాగానే ఆయన కారు వద్దకు వెళ్లి రిసీవ్ చేసుకున్నారు నాని. సరదాగా మాట్లాడారు. ఈ సీన్ ఇప్పుడు ఇంట్రస్టింగ్గా మారింది.
గుడివాడలో వైసీపీ నేత కూతురు వివాహ వేడుకలో పాల్గొన్నారు కొడాలి నాని, వంగవీటి రాధ. వధూవరుల్ని ఆశీర్వదించాక.. ఆత్మీయంగా చాలాసేపు మాట్లాడుకున్నారు. గతంలోనూ కొన్ని ఫంక్షన్లలో ఎదురుపడ్డప్పుడు కూడా ఇలాంటి దృశ్యమే కనిపించినా.. ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ సీన్కి ప్రాధాన్యత కనిపిస్తోంది. కారణం.. వైసీపీలో ఉన్న కొడాలి నాని, టీడీపీలో ఉన్న కొడాలి నాని ఇద్దరూ కలవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే, కొడాలి నానీ తన స్నేహితుడు రాధాకి అంత ప్రాధాన్యం ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటి అనేది ఇప్పుడు తొలుస్తున్న ప్రశ్న.
వంగవీటి రాధా టీడీపీలో చేరక ముందు వైసీపీలోనే ఉన్నారు. కానీ, ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరారు. ఆ సమయంలో రాధా, నాని ల మధ్య గ్యాప్ పెరిగిందని, ఇద్దరు మధ్య సంబంధాలు తెగిపోయాయని అంతా భావించారు. కానీ, రాజకీయాలు రాజకీయాలే, స్నేహం స్నేహమే అని ఇద్దరు నేతలూ చాటిచెబుతూ వచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..