కిడ్నీ రాకెట్ కేసు: శ్రద్ధా హాస్పిటల్ సీజ్
విశాఖపట్నంలో కలకలం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో వరుస అరెస్ట్ లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రద్ధా హాస్పిటల్ ఎండీ డాక్టర్ ప్రదీప్ ను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ పద్దతులలో కిడ్నీ ఆపరేషన్లు నిర్వహించినట్లు గతంలో శ్రద్ధా హాస్పిటల్పై ఆరోపణలు వచ్చాయి. దీనితో ఆ ఆసుపత్రిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జిల్లా కలెక్టర్ కే.భాస్కర్ ఆదేశాల ప్రకారం శనివారం హాస్పిటల్ను పోలీసులు సీజ్ చేశారు. కాసుల కక్కుర్తితో శ్రద్ధా హాస్పటల్ 30 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ […]
విశాఖపట్నంలో కలకలం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో వరుస అరెస్ట్ లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రద్ధా హాస్పిటల్ ఎండీ డాక్టర్ ప్రదీప్ ను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ పద్దతులలో కిడ్నీ ఆపరేషన్లు నిర్వహించినట్లు గతంలో శ్రద్ధా హాస్పిటల్పై ఆరోపణలు వచ్చాయి. దీనితో ఆ ఆసుపత్రిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జిల్లా కలెక్టర్ కే.భాస్కర్ ఆదేశాల ప్రకారం శనివారం హాస్పిటల్ను పోలీసులు సీజ్ చేశారు. కాసుల కక్కుర్తితో శ్రద్ధా హాస్పటల్ 30 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలను ఎటువంటి అనుమతి లేకుండా చేసిందని త్రిసభ్య కమిటీ పేర్కొంది. ఇక ఈ రాకెట్లో మధ్యవర్తిగా ఉన్న డాక్టర్ మంజూనాథ్ను కూడా బెంగుళూరులో అరెస్టు చేశారు.