KA Paul: వచ్చేస్తున్నా.. అప్పులన్నీ తీర్చేస్తా.. కేఏ పాల్..

ఆంధ్రప్రదేశ్‎లో పరిస్థితిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ఏపీలో జరిగింది చాలని.. తాను వచ్చేస్తున్నానని.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంతా కలిసి నడుద్దామని పిలుపునిచ్చారు...

KA Paul: వచ్చేస్తున్నా.. అప్పులన్నీ తీర్చేస్తా.. కేఏ పాల్..
Paul
Follow us

|

Updated on: Oct 23, 2021 | 8:38 PM

ఆంధ్రప్రదేశ్‎లో పరిస్థితిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ఏపీలో జరిగింది చాలని.. తాను వచ్చేస్తున్నానని.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంతా కలిసి నడుద్దామని పిలుపునిచ్చారు. జగన్, చంద్రబాబు ప్రభుత్వాలు దోపిడీకే సరిపోయాయని.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశాన్ని అప్పుల్లోకి నెట్టిందని ఆరోపించారు. ఆయన ఫేస్‎బక్ లైవ్‎లో ప్రెస్ మీట్ పెట్టారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు.. యూత్.. నిరుద్యోగులు.. మహిళలు, అన్ని సామాజిక వర్గాలు.. ప్రజాశాంతి పార్టీతో కలిసి రావాలని కోరారు. ప్రజాశాంతి పార్టీ కార్యాలయం నుంచి కొందరు నేతలు పాల్ తోపాటు మాట్లాడారు.

అప్పులు చేసి అభివృద్ధి చేయడం.. తిరిగి అప్పులు తీర్చడం.. తనతో తప్ప మరెవరితో సాధ్యం కాదని కేఏ పాల్ అన్నారు. ప్రజల కోసం పని చేసేందుకు సిద్ధపడ్డానని కేఏ పాల్ అన్నారు. త్వరలో తాను వచ్చేస్తున్నా.. అంటూ చెప్పారు. దేశ వ్యాప్తంగా ప్రజలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని.. రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని.. ఇలాంటి సమయంలో.. ఫైటింగ్ లు, అరెస్టులు, తిట్లతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రేమించే వాళ్లు, అభివృద్ధి కోరుకునేవాళ్లు తనతో కలిసి నడవాలన్నారు. ఒకరు తిడతారు.. మరొకరు దాడులు చేస్తారు.. ఆంధ్రప్రదేశ్‎లో ఇదే జరుగుతోందని అన్నారు. ఇలాంటి రాజకీయాలకు స్వస్తి చెప్పాలన్నారు.

Read Also.. Crime News: అనంతపురం జిల్లా కసాయి తండ్రి అరెస్ట్.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు..