Janasena: వ్యూహాలు, ప్రతివ్యూహాలతో ఉరకలేస్తున్న జనసేన.. నేడు పీఏసీ మీటింగ్
జనసేన జోష్ పెంచింది. ఈ మధ్య కాలంలో బాగా యాక్టివ్ అయ్యింది. అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నేడు పార్టీ పీఏసీ మీటింగ్ జరగనుంది.
ఏపీ జనసేన జెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో… అధికార వైసీపీని ఢీకొట్టేందుకు ఉరకలేస్తోంది. అందుకు తగ్గట్టే.. వరుస కార్యక్రమాలతో కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు అధినేత పవన్. పార్టీ ప్రధాన కార్యాలయంలో కీలకమైన పీఏసీ మీటింగ్ నిర్వహిస్తున్నారు పవన్. దీంతో, పొలిటికల్గా ఇప్పుడు అందరిదృష్టీ ఈ సమావేశంపైనే కేంద్రీకృతమైంది. జనసైనికులకు బాస్ ఏం చెప్పబోతున్నారు? ఏవిధమైన మార్గనిర్దేశకత్వం చేయబోతున్నారు? అనేదే ఆసక్తి రేపుతోంది.
విశాఖ ఎయిర్పోర్టు ఇష్యూలో అరెస్టై విడుదలైన జనసేన నాయకులతో.. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు జనసేనాని. వారి కుటుంబాలను పరామర్శించిన జనసేన చీఫ్… పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. దీనికి సంబంధించి వీడియోను.. ట్విట్టర్లో షేర్ చేసింది జనసేన పార్టీ. ఇప్పటికే జనసేనతో మాటల యుద్ధం నడుస్తున్న వేళ… వైఎస్ఆర్ సీపీకి చెందిన కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సోమవారం… ప్రత్యేకంగా సమావేశం అవుతుండటం రాజకీయంగా మరింత ఆసక్తి రేపుతోంది. ఇటీవల విశాఖ ఎపిసోడ్కు సంబంధించి.. వైసీపీలోని కాపు నేతలపై పవన్కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. దీనిపై వైసీపీ కాపు నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం, రాజమండ్రిలోని ఓ హోటల్లో వైఎస్ఆర్ సీపీ కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సమావేశం కానుండటంతో.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది. పవన్ కళ్యాణ్ తమను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై చర్చించనున్నట్లు సమాచారం.
కరెక్టుగా ఒక్కరోజు ముందే, పవన్ కల్యాణ్.. జనసేన పీఏసీ మీటింగ్ ఏర్పాటు చేయడంతో పొలిటికల్గా చర్చనీయాంశంగా మారింది. కాపు లీడర్స్ సమావేశాన్ని పవన్ ఏ కోణంలో చూస్తారన్నదే ఆసక్తి రేపుతోంది. రేపేమో వైసీపీ కాపునేతల మీటింగ్, ఇవాళ జనసేన పీఏసీ మీటింగ్… దీంతో ఏపీలో పొలిటికల్గా పొగ మొదలైంది. మరి, ఇది మళ్లీ నిప్పు రాజేస్తుందా? అనేదే అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్.
మరిన్ని ఏపీ వార్తల కోసం..