ఏపీలో భారీగా ఐపీఎస్ల బదిలీలు.. రంగం సిద్ధం
ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీకి రంగం సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వం బదిలీల జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ జాబితా ప్రకారం నాలుగు జిల్లాల ఎస్పీలకు స్థాన చలనం లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయవాడ సీపీగా సేవలు అందిస్తున్న ద్వారకా తిరుమల రావును..
ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీకి రంగం సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వం బదిలీల జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ జాబితా ప్రకారం నాలుగు జిల్లాల ఎస్పీలకు స్థాన చలనం లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయవాడ సీపీగా సేవలు అందిస్తున్న ద్వారకా తిరుమల రావును.. రైల్వేస్ డీజీపీగా బదిలీ చేసే అవకాశం ఉంది. ఆయన స్థానంలో బీ శ్రీనివాసులు నియమితులు కానున్నట్లు సమాచారం. ఈ మేరకు ఒకటి రెండు రోజులలో అధికారిక జీవో విడుదలయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం ప్రభుత్వం సిద్ధం చేసిన జాబితా:
- విజయవాడ రైల్వేస్ ఎస్పీగా సీహెచ్ విజయరామారావు
- సీఐడీ ఎస్పీగా గ్రేవల్ నవదీప్ సింగ్
- మంగళగిరి ఎపీఎస్పీ కమాండెంట్గా ఎం దీపిక
- పశ్చిమగోదావరి ఎస్పీగా కే నారాయణ
- గుంటూరు అర్బన్ ఎస్పీగా అమ్మిరెడ్డి
- గుంటూరు రూరల్ ఎస్పీగా విశాల్ గున్నీ
- విశాఖ డీసీపీ 1గా ఐశ్వర్య రస్తోగి
- విశాఖ రూరల్ ఎస్పీగా బి కృష్ణా రావు
- విశాఖ ఎస్ఐబీ ఎస్పీగా అట్టాడ బాబూజీ
- శ్రీకాకుళం ఎస్పీగా అమిత్ బర్దార్
- శ్రీకాకుళం అడ్మిన్ ఏఐజీగా బిల్లా ఉదయ్ భాస్కర్
- రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీపీగా క్రిపానంద త్రిపాటి ఉజేలా
- ఆర్గనైజేషన్ అడిషనల్ డీజీపీగా ఎన్ బాలసుబ్రహ్మణ్యం
- ఎస్ఈబీ డైరెక్టర్గా పీహెచ్డీ రామకృష్ణ