Andhra Pradesh: అస్తి కోసం వివాహిత దారుణం.. నిద్రిస్తున్న భర్త, కుమారుడి నిప్పటించిన వైనం..!

Andhra Pradesh: అన్నదమ్ములు మాయ.. ఆలు మగలు మాయ. ఆస్తి కోసం భవబందాల్ని కూడా లెక్క చేయడం లేదు నేటి సమాజం. అన్నమయ్య జిల్లాలో

Andhra Pradesh: అస్తి కోసం వివాహిత దారుణం.. నిద్రిస్తున్న భర్త, కుమారుడి నిప్పటించిన వైనం..!
Man Died
Follow us

|

Updated on: Jun 19, 2022 | 5:55 AM

Andhra Pradesh: అన్నదమ్ములు మాయ.. ఆలు మగలు మాయ. ఆస్తి కోసం భవబందాల్ని కూడా లెక్క చేయడం లేదు నేటి సమాజం. అన్నమయ్య జిల్లాలో ఓ వివాహిత చేసిన దారుణ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అవును, అన్నమయ్య జిల్లాలో అమానుషం జరిగింది. ఆస్తి కోసం తండ్రీ, కొడుకులపై నిప్పంటించిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రైల్వేకోడూరులోని రంగనాయకులపేటకు చెందిన స్వామినాయక్‌కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు లక్ష్మీబాయి, రెండో భార్య పేరు గంగూబాయి. రెండో భార్య గంగూబాయి స్వామినాయక్‌కు గౌతమ్ అనే కొడుకు కూడా ఉన్నాడు. స్వామినాయక్‌కు మొదటి భార్య లక్ష్మీబాయికి కొన్ని రోజులుగా ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో మొదటి భార్యకు దూరంగా.. గంగూబాయి దగ్గరే స్వామి నాయక్ ఉంటున్నాడు.

ఆస్తిని రెండో భార్యకో లేదంటే గౌతమ్‌కో రాసిస్తాడనే అనుమానంతో.. భర్తపై లక్ష్మీబాయి కక్ష పెంచుకుంది. వారిని ఎలాగైనా అంతం చేయాలనే దుర్మార్గపు ఆలోచన మనసులో పెట్టుకుంది. శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న.. స్వామినాయక్, గౌతమ్‌పై పెట్రల్ పోసి నిప్పింటించింది. కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి మంటలు ఆర్పేశారు. అప్పటికే ఇద్దరి శరీరాలు పూర్తిగా కాలిపోయాయి. వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి వారి పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత నిందితురాలు లక్ష్మీబాయితో పాటు ఆమెకు సహకరించిన బంధువులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..