Andhra Pradesh: అస్తి కోసం వివాహిత దారుణం.. నిద్రిస్తున్న భర్త, కుమారుడి నిప్పటించిన వైనం..!
Andhra Pradesh: అన్నదమ్ములు మాయ.. ఆలు మగలు మాయ. ఆస్తి కోసం భవబందాల్ని కూడా లెక్క చేయడం లేదు నేటి సమాజం. అన్నమయ్య జిల్లాలో
Andhra Pradesh: అన్నదమ్ములు మాయ.. ఆలు మగలు మాయ. ఆస్తి కోసం భవబందాల్ని కూడా లెక్క చేయడం లేదు నేటి సమాజం. అన్నమయ్య జిల్లాలో ఓ వివాహిత చేసిన దారుణ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అవును, అన్నమయ్య జిల్లాలో అమానుషం జరిగింది. ఆస్తి కోసం తండ్రీ, కొడుకులపై నిప్పంటించిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రైల్వేకోడూరులోని రంగనాయకులపేటకు చెందిన స్వామినాయక్కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు లక్ష్మీబాయి, రెండో భార్య పేరు గంగూబాయి. రెండో భార్య గంగూబాయి స్వామినాయక్కు గౌతమ్ అనే కొడుకు కూడా ఉన్నాడు. స్వామినాయక్కు మొదటి భార్య లక్ష్మీబాయికి కొన్ని రోజులుగా ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో మొదటి భార్యకు దూరంగా.. గంగూబాయి దగ్గరే స్వామి నాయక్ ఉంటున్నాడు.
ఆస్తిని రెండో భార్యకో లేదంటే గౌతమ్కో రాసిస్తాడనే అనుమానంతో.. భర్తపై లక్ష్మీబాయి కక్ష పెంచుకుంది. వారిని ఎలాగైనా అంతం చేయాలనే దుర్మార్గపు ఆలోచన మనసులో పెట్టుకుంది. శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న.. స్వామినాయక్, గౌతమ్పై పెట్రల్ పోసి నిప్పింటించింది. కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి మంటలు ఆర్పేశారు. అప్పటికే ఇద్దరి శరీరాలు పూర్తిగా కాలిపోయాయి. వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి వారి పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత నిందితురాలు లక్ష్మీబాయితో పాటు ఆమెకు సహకరించిన బంధువులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.