Nellore Hospital: ప్రాణాలతో చెలగాటం.. డాక్టర్లుగా ఆస్పత్రి సిబ్బంది.. ప్రాణాలు తీసిన వైద్యుల నిర్లక్ష్యం.
Nellore Government Hospital: వైద్యో నారాయణో హరిః, కానీ ఒక్కసారిగా ఈ ఆసుపత్రి గురించి తెలుసుకున్న తర్వాత ఆ మీనింగ్ మారిపోతుంది. వైద్యో నారాయణో హరీ..అంటే వైద్యుడు దేవుడితో సమానం అన్నది అసలు అర్థం..కానీ ఈ ఆసుపత్రిలో మాత్రం వైద్యం కోసం వెళితే ప్రాణాలు పోతాయన్నది అర్థం..ఇది ఓ ప్రభుత్వాసుపత్రి దుస్థితి..
పెషెంట్ ప్రాణాలతో చెలగాటం.. మేమే డాక్టర్లు అన్న గర్వం.. ఇది ఓ ప్రభుత్వాసుపత్రిలోని సిబ్బంది తీరు.. ఇది నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆసుపత్రి సిబ్బందే డాక్టర్లుగా మారిపోయారు.. ఆసుపత్రికి వచ్చిన వారికి వైద్యం చేస్తున్నారు..ఇది చూసి కూడా అక్కడి డాక్టర్లు నోరు మెదపడం లేదు..ఎంతటి అమానవీయం. కాంపౌండర్లు కుట్లు వేశారు.. స్వీపర్లు, సెక్యూరిటీ సిబ్బంది ట్రీట్మెంట్ చేశారు.. డాక్టర్ల అవతారమెత్తి వచ్చీ రాని వైద్యం చేశారు. యాక్సిడెంట్లో గాయపడ్డ ఓ లెక్చరర్ను చంపేశారు. నెల్లూరుజిల్లా ఆత్మకూరు ప్రభుత్వ దవాఖానాలో జరిగిందీ దారుణం. ఆత్మకూరులో నిన్న బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ఘటనలో గాయపడ్డ ఇద్దర్ని స్తానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అంబులెన్స్ వచ్చిన వారిని స్టెచర్లో హాస్పిటల్ వార్డులోకి తీసుకెళ్లారు. కాంపౌండర్లు, స్వీపర్లు, సెక్యూరిటీ సిబ్బంది అంతా తామే అన్నట్టుగా వ్యవహరించారు. లెక్చరర్ రామకృష్ణకు సెలైన్లు పెట్టారు. తలకు కట్టు కట్టారు. గాయాలైన చోట కుట్లు కూడా వేశారు.
కాంపౌండర్లు, సెక్యూరిటీ సిబ్బంది ట్రీట్మెంట్ చేస్తుంటే డాక్టర్లు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. వాళ్లూ వీళ్లూ అడిగితే జస్ట్ అలా వెళ్లి ఇంజక్షన్ చేసి వెళ్లిపోయాడు డ్యూటీ డాక్టర్. ఈ క్రమంలోనే లెక్చరర్ పరిస్థితి విషమించి ప్రాణాలు విడిచాడు. ప్రభుత్వ దవాఖానాలో నిర్లక్ష్యం ఈ స్థాయిలో ఉంది.
కళ్లముందే చనిపోయిన లెక్చరర్ కుటుంబం ఇప్పుడు గుండెలు బాదుకుంటోంది. అంతులేని నిర్లక్ష్యం రామకృష్ణను పొట్టన బెట్టుకుందని కన్నీరుమున్నీరవుతోంది.
అసలేం జరిగిదంటే..
ఆత్మకూరులో బైక్ యాక్సిడెంట్ జరిగింది.. ఇందులో ఇద్దరు వ్యక్తులు గాయాపడ్డారు వారిని ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. అయితే గాయపడి ఆసుపత్రికి వచ్చిన వారిపై వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అంతేకాకుండా ఆస్పత్రిలో పనిచేసే సెక్యూరిటీ సిబ్బందే, సెలైన్ పెట్టారు. డ్యూటీ డాక్టర్, అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం ఇంజక్షన్ వేసి సరిపెట్టుకున్నారు.
ఈ ప్రమాదంలో గాయపడిన లెక్చరర్ రామకృష్ణ పరిస్థితి విషమంగా మారింది. దీంతో మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ అంబులెన్స్లో నెల్లూరుకు తరలించారు. అయితే, అంబులెన్స్ ఎక్కిస్తుండగానే, రామకృష్ణ తలకు సెక్యూరిటీ గార్డు కట్టిన కట్టు ఊడిపోయింది. మళ్లే అంతే నిర్లక్ష్యంగా కట్టు కట్టి కట్టారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బాధితులు.
డాక్టర్ అంటే సామాన్యుడికి ప్రత్యక్ష దైవం.. అలాంటి వైద్యుడు ఆపద్బాంధవుడులా పేషెంట్స్ను చూడాల్సిందిపోయి. సిబ్బంది వైద్యం చేస్తుంటే చూస్తుండిపోయాడు.. గాయపడి వచ్చిన వారికి వాళ్లే కట్టుకట్టారు.. అది కూడా వేరే ఆసుపత్రికి వెళ్లేలోపే ఊడిపోయింది.. ఆత్మకూరు ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్ ఉన్నా సరిగా స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: Cyclone Asani Live Updates: కాసేపట్లో తీరాన్ని తాకనున్న అసని తుఫాన్.. కాకినాడ తీరంలో రెడ్ అలర్ట్..