Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. దూసుకొస్తున్న వాయుగుండం..! ఆ జిల్లాల్లో కుండపోత వానలే..
ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం.. తీవ్ర అల్పపీడనంగా మారింది.
Andhra Pradesh Weather Report: ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం.. తీవ్ర అల్పపీడనంగా మారింది. ధ్రోణి ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వీటితోపాటు చిత్తూరు, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడతాయనీ, దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు (Rains) పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
వాయుగుండం రాబోయే 24 గంటల్లో తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర వైపు కదిలి.. చెన్నై-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్న కారణంగా బుధవారం వరకూ మత్య్సకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
వాయుగుండం నెమ్మదిగా బలహీనపడటం ప్రారంభించిందని.. ఈ క్రమంలో నేడు, రేపు భారీ వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. రేపు ఉదయం నుంచి నెల్లూరు, తిరుపతి జిల్లాలకు కూడా దీని ప్రభావం కనిపిస్తుందని అధికారులు తెలిపారు. ఈ కారణంగా రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా చల్లబడింది.
STRONG DEPRESSION near Chennai has slowly started to weaken as Dry air reduces the Power of the Storm. Rain Showers will take a break till Tonight as the Weak system moves closer and will be back along Nellore and Tirupati districts from Tomorrow Morning. pic.twitter.com/X0tvJ68slG
— Andhra Pradesh Weatherman (@APWeatherman96) November 22, 2022
మరిన్ని ఏపీ వార్తల కోసం..