Gudivada: 15 ఏళ్ల బాలుడు, 30 ఏళ్ల వివాహిత మిస్సింగ్ కేసులో సంచలన విషయాలు.. ఆ వీడియోలు చూపించి

అతనికి 15 ఏళ్లు.. ఆమెకు 30 ఏళ్లు.. కృష్ణా జిల్లాలో వీరిద్దరి మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. విచ్చలవిడి విశృంఖలత్వం 2 కుటుంబాల్లో అశాంతిని రాజేసింది. ఓ మైనర్‌ని తప్పుదోవ పట్టించిన మహిళను పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు.

Gudivada: 15 ఏళ్ల బాలుడు, 30 ఏళ్ల వివాహిత మిస్సింగ్ కేసులో సంచలన విషయాలు.. ఆ వీడియోలు చూపించి
Representative image
Follow us

|

Updated on: Jul 27, 2022 | 3:17 PM

Andhra Pradesh: ఊహించని ట్విస్ట్ ఇది. కనీసం ఇలా కూడా జరుగుతుందా అని అస్సలు గెస్ చేయలేం. కృష్ణా జిల్లా(Krishna District) గుడివాడలో ఈ నెల 19న 15 ఏళ్ల మైనర్ బాలుడితో పాటు.. అతడి ఇంటి ఎదురుగా నివాసం ఉండే 30 ఏళ్ల వివాహిత మిస్సింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. వివాహిత సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా.. వారు హైదరాబాద్‌(Hyderabad) బాలానగర్​లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. ట్రేస్ చేసి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వెల్లడైన వాస్తవాలు పోలీసులనే విస్మయానికి గురి చేశాయి. బాలుడికి పోర్న్ వీడియోలు చూపించి.. శారీరక సంబంధం పెట్టుకుంది సదరు వివాహిత. గుడివాడలోనే ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయని.. ఎక్కడికైనా వెళ్దామని మాయమాటలు చెప్పి.. మైనర్‌ను తీసుకెళ్లింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుడివాడ గుడ్​మెన్ పేటలో నివాసం ఉండే వివాహితకు పెళ్లై.. పిల్లలు కూడా ఉన్నారు. కానీ భర్తకు అనారోగ్య సమస్యలు ఉండటంతో.. అతను వేరే చోట ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఆమె మనసులో తప్పుడు ఆలోచనలు బలపడ్డాయి. ఎదురింట్లో ఉండే బాలుడిని బుట్టలో వేసుకోవాలని భావించింది. యాక్షన్ ప్లాన్‌లో భాగంగా అతడికి బాగా దగ్గరయ్యింది. అనంతరం పోర్న్ వీడియోలు చూపించి.. శారీరక సంబంధం ఏర్పరచుకుంది. గుట్టుగా ఈ వ్యవహారం నెలరోజులు కొనసాగించింది.

ఎవరికైనా తెలిస్తే ఇబ్బంది వస్తుందేమో అని భావించి.. మాయచేసి బాలుడిని హైదరాబాద్ తీసుకెళ్లింది. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో టూ టౌన్ సీఐ దుర్గారావు తన టీమ్‌తో కలిసి ఎంక్వైరీ చేశారు. ఆపై వివాహిత బాలుడిని కిడ్నాప్ చేసినట్లు నిర్ధారించకున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి..వారిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి ఫ్యామిలీకి అప్పగించారు. స్వప్నపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..