తీవ్ర విషాదం: అనుమానంతో తలుపు తట్టి చూడగా..

కర్నూల్ జిల్లా నందికొట్కూరు పట్టణం బుడగ జంగం కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విగతజీవులయ్యారు. రోజూ కళ్లముందు కనిపించే ఒక కుటంబం ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు షాకయ్యారు. ఎంతసేపటికీ ఇంటి నుంచి బయటకు రావడంలేదేని అనుమానంతో తలుపుతట్టే ప్రయత్నం చేశారు. కానీ తలుపు తెరవకపోవడంతో కిటికీలో నుంచి చూడగా భార్య భర్తలిద్దరూ ఉరి వేసుకుని ఉన్నారు. వాళ్లు అప్పటికే చనిపోయి ఉన్నారు. పక్కనే ఆ దంపతుల ఇద్దరు పిల్లలు కూడా చనిపోయి […]

తీవ్ర విషాదం: అనుమానంతో తలుపు తట్టి చూడగా..
Follow us

|

Updated on: Mar 20, 2019 | 10:54 AM

కర్నూల్ జిల్లా నందికొట్కూరు పట్టణం బుడగ జంగం కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విగతజీవులయ్యారు. రోజూ కళ్లముందు కనిపించే ఒక కుటంబం ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు షాకయ్యారు.

ఎంతసేపటికీ ఇంటి నుంచి బయటకు రావడంలేదేని అనుమానంతో తలుపుతట్టే ప్రయత్నం చేశారు. కానీ తలుపు తెరవకపోవడంతో కిటికీలో నుంచి చూడగా భార్య భర్తలిద్దరూ ఉరి వేసుకుని ఉన్నారు. వాళ్లు అప్పటికే చనిపోయి ఉన్నారు. పక్కనే ఆ దంపతుల ఇద్దరు పిల్లలు కూడా చనిపోయి ఉన్నారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు.

ఎంతో అన్యోన్యంగా కలిసి ఉండే భార్యాభర్తలు ఇలా చేసుకోవడం తాము నమ్మలేకపోతున్నామని చుట్టుపక్కలవారు అంటున్నారు. ఈ కుటుంబం వీధిల్లో చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవారు. భర్త పేరు వీరాంజనేయులు(35 సంవత్సరాలు), భార్య పేరు వసంత(32 సంవత్సరాలు). వీరి పిల్లలు రామలక్ష్మి(7 సంవత్సరాలు), రాజేశ్(5 సంవత్సరాలు).