గోదావరి వరదలో జేసీబీ డ్రైవర్ను రక్షించబోయి..!
అకస్మాత్తుగా వచ్చిన గోదావరి వరద కొందరి పాలిట శాపమైంది. సడన్గా వరదను ఊహించని ఓ జేసీబీ డ్రైవర్ను రక్షించబోయిన పోలీసులు వరదనీటిలో చిక్కుకున్న సంఘటన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం దగ్గర జరిగింది. గోదావరికి ఆకస్మిక వరద పోటెత్తింది. దీంతో.. గోదావరిలో హైటెన్షన్ టవర్లు నిర్మిస్తున్న సమయంలో ఒక్కసారిగా వరద నీరు రావడంతో జేసీబీ మునిగిపోయింది. జేసీబీ డ్రైవర్ను రక్షించేందుకు వెళ్లిన ఆత్రేయపురం ఎస్ఐ, పోలీసులు కూడా నీటిలో చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న రావులపాలెం సీఐ కృష్ణ నాటుపడవపై […]
అకస్మాత్తుగా వచ్చిన గోదావరి వరద కొందరి పాలిట శాపమైంది. సడన్గా వరదను ఊహించని ఓ జేసీబీ డ్రైవర్ను రక్షించబోయిన పోలీసులు వరదనీటిలో చిక్కుకున్న సంఘటన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం దగ్గర జరిగింది.
గోదావరికి ఆకస్మిక వరద పోటెత్తింది. దీంతో.. గోదావరిలో హైటెన్షన్ టవర్లు నిర్మిస్తున్న సమయంలో ఒక్కసారిగా వరద నీరు రావడంతో జేసీబీ మునిగిపోయింది. జేసీబీ డ్రైవర్ను రక్షించేందుకు వెళ్లిన ఆత్రేయపురం ఎస్ఐ, పోలీసులు కూడా నీటిలో చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న రావులపాలెం సీఐ కృష్ణ నాటుపడవపై వెళ్లి పోలీసులను రక్షించారు. జేసీబీ వరద నీటిలో కొట్టుకుపోయింది.
#WATCH Andhra Pradesh: An excavation vehicle deployed to erect high tension towers in river Godavari at Atreyapuram in East Godavari district submerged after the river water level rose. pic.twitter.com/vg2y0J2lNS
— ANI (@ANI) July 8, 2019