Earthquake: భయంతో పరుగులు పెట్టిన జనం.. నెల్లూరు జిల్లాలో మూడు సెకన్ల పాటు భూప్రకంపనాలు
మూడు సెకన్ల పాటు భూప్రకంపనాలతో జనం భయాందోళనకు గురయ్యారు. చేజర్లలో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. ఈ భూప్రకంపనాలకు ఇంకా కారణాలు తెలియలేదు.
నెల్లూరు జిల్లాలో భూమి కంపించింది. మూడు సెకన్ల పాటు భూప్రకంపనాలతో జనం భయాందోళనకు గురయ్యారు. చేజర్లలో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. ఈ భూప్రకంపనాలకు ఇంకా కారణాలు తెలియలేదు. ఇటీవల వరుస ప్రకంపనాలు రావడంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. ఇళ్లల్లోని వస్తువులు కదలడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అనంతరం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే సుమారు మూడు సెకన్ల పాటు భూమి కంపించినట్లు గ్రామస్తులు తెలిపారు. స్వల్పంగానే భూ ప్రకంపనాలు వచ్చినట్లుగా వారు తెలిపారు. భయందోళనకు గురైన ప్రజలు చాలా సేపు ఇళ్లలోకి వెళ్లకుండా బయటే ఉండిపోయారు. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదన్నారు. ఇటీవల జిల్లాలోని నాలుగు మండలాల్లో భూ ప్రకంపనలు వచ్చిన విషయం తెలిసిందే.
ఆదివారం ఉత్తరాఖండ్లో భూ ప్రకంపనాలు
ఇదిలావుంటే.. ఉత్తరాఖండ్లోని టెహ్రీలో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రత నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) తెలిపింది. నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ ప్రకారం.. ఉత్తరకాశీకి తూర్పు-ఆగ్నేయంగా 17 కిలోమీటర్ల దూరంలో 5 కిలోమీటర్ల లోతులో భూప్రకంపనాలు సంభవించినట్లుగా వారు తెలిపారు. ఉదయం 8.33 గంటలకు భూకంపం సంభవించినట్టుగా ఎన్సీఎస్ పేర్కొంది. ఈ మేరకు ట్విట్టర్లో ఎన్సీఎస్ పోస్టు కూడా చేసింది.
మరిన్ని ఏపీ న్యూస్ కోసం