బ్రేకింగ్.. దుర్గామాత విగ్రహాల ధ్వంసం..!
తూర్పుగోదావరి జిల్లాలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు.. దుర్గా మాత విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన జిల్లాలోని సర్పవరంలో అర్థరాత్రి చోటుచేసుకుంది. దేవీ నవరాత్రుల కోసం తయారు చేసిన దుర్గామాత విగ్రహాలను దుండగుల ధ్వంసం చేయడంతో తయారీ దారులు బోరున విలపిస్తున్నారు. మొత్తం 150కి పైగా విగ్రహాలను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. అయితే తయారీ దారులు మాత్రం తమకు ఎవరితోనూ విరోధం లేదని.. ఎవరో కుట్రపూరితంగానే […]
తూర్పుగోదావరి జిల్లాలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు.. దుర్గా మాత విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన జిల్లాలోని సర్పవరంలో అర్థరాత్రి చోటుచేసుకుంది. దేవీ నవరాత్రుల కోసం తయారు చేసిన దుర్గామాత విగ్రహాలను దుండగుల ధ్వంసం చేయడంతో తయారీ దారులు బోరున విలపిస్తున్నారు. మొత్తం 150కి పైగా విగ్రహాలను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. అయితే తయారీ దారులు మాత్రం తమకు ఎవరితోనూ విరోధం లేదని.. ఎవరో కుట్రపూరితంగానే ఈ విగ్రహాల ధ్వంసం జరిగిందని తయారీ దారులు ఆరోపిస్తున్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తయారు చేశామని.. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. అటు హిందూ సంఘాలు కూడా ఈ ఘటనపై మండిపడుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.