Andhra Pradesh: కోడలి తల నరికి కవర్లో పెట్టి.. పోలీస్ స్టేషన్కు వచ్చిన అత్త..
కుటుంబ కలహాలతో కోడలి తల అత్త నరికేసింది అత్త. మొండం నుంచి తలను వేరు చేసింది. ఆపై ఆ తలను కవర్లో పెట్టి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చింది.
AP Crime News: క్రైమ్ రేట్ రోజురోజుకు పెరిగిపోతుంది. బంధాలు, బంధుత్వాలు కూడా పట్టించుకోవడం లేదు. తేడా వస్తే చాలు ఖతం చేస్తున్నారు. తాజాగా అన్నమయ్య జిల్లా(Annamayya district)లో దారుణం జరిగింది. ఓ అత్త తన కోడలి తల నరికి పోలీస్ స్టేషన్కు తీసుకుని రావడం స్థానికంగా కలకలం రేపుతోంది. రాయచోటి(Rayachoty)లోని కొత్తపేట రామాపురానికి చెందిన సుబ్బమ్మ.. తన కోడలితో ఘర్షణకు దిగింది. ఆవేశంలో కోడలి తలనే నరికేసింది. మొండెం నుంచి తలన వేరు చేసి.. రక్తం కారుతున్న ఆ తలను పట్టుకుని నడుచుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చింది. ఇది చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ప్రస్తుతానికి సుబ్బమ్మను అదుపులోకి తీసుకున్నారు. కోడలిని చంపడానికి కారణం ఏంటి? అసలేం జరిగిందనే దానిపై ఎంక్వైరీ జరుగుతోంది. రాయచోటి చరిత్రలోనే ఇలాంటి ఘటన జరగడం ఇదే ఫస్ట్ టైమ్ అంటున్నారు స్థానికులు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి