ఇసుకాసురులకు కోర్టు షాక్..!
ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారా..తస్మాత్ జాగ్రత్త !..పొరపాటున పట్టుబడితే జరిమానా చెల్లిస్తే సరి.. అని తేలిగ్గా తీసుకుంటున్నారా..? ఇసుక మాఫియాకు గూబలు గుయ్యిమనేలా కడప కోర్టు ఇచ్చిన తీర్పు దడ పుట్టిస్తోంది.గత రెండు నెలలుగా రాష్ట్రంలో ఇసుక తుఫాన్ రాజకీయ పార్టీల మధ్య హై టెన్షన్ క్రియేట్ చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు ఉద్యమాలు చేశాయి. ప్రభుత్వం కూడా ఇందుకు ధీటుగా స్పందించింది. ఇసుక అక్రమ రవాణా చేస్తే రెండేళ్ల జైలుశిక్ష, రెండు లక్షల జరిమానా విధిస్తామని […]
ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారా..తస్మాత్ జాగ్రత్త !..పొరపాటున పట్టుబడితే జరిమానా చెల్లిస్తే సరి.. అని తేలిగ్గా తీసుకుంటున్నారా..? ఇసుక మాఫియాకు గూబలు గుయ్యిమనేలా కడప కోర్టు ఇచ్చిన తీర్పు దడ పుట్టిస్తోంది.గత రెండు నెలలుగా రాష్ట్రంలో ఇసుక తుఫాన్ రాజకీయ పార్టీల మధ్య హై టెన్షన్ క్రియేట్ చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు ఉద్యమాలు చేశాయి. ప్రభుత్వం కూడా ఇందుకు ధీటుగా స్పందించింది. ఇసుక అక్రమ రవాణా చేస్తే రెండేళ్ల జైలుశిక్ష, రెండు లక్షల జరిమానా విధిస్తామని అల్టిమేటం ఇచ్చింది. ఈ నేపథ్యంలో కడపజిల్లా కోర్టు ఇచ్చిన తీర్పు ఇసుకాసురులకు షాక్ ఇచ్చింది.
ఈ ఏడాది జులై 15వ తేదీ సాయంత్రం పెండ్లిమర్రి మండలం గోపరాజుపల్లె సమీపంలో పాపాగ్ని నది నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్లో ఇసుక అక్రమ రవాణా చేస్తుండగా, అప్పటి ఎస్సై భక్తవత్సలం పట్టుకుని కేసు నమోదు చేసి ఛార్జ్ షీట్ వేశారు. గోపరాజుపల్లెకు చెందిన నంద్యాల సుబ్బారాయుడును దోషిగా పేర్కొంటూ కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో వాదోపవాదాలు పరిశీలించిన రెండవ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ప్రస్తుతం ఈ తీర్పు ఇసుక అక్రమార్కుల్లో దడ పుట్టిస్తోంది. ప్రభుత్వ ఆదేశాలు అమలులోకి రాకముందే జరిగిన ఇసుక అక్రమ రవాణా కేసులో న్యాయస్థానం ఈ విధమైన తీర్పు ఇస్తే..తాజాగా ఇంకెలాంటి సంచలన తీర్పులు వస్తాయోనన్న గుబులు మొదలైంది