Skoch Award: ‘స్కోచ్’ సీఎంగా ఏపీ సీఎం వైఎస్ జగన్.. అవార్డును ప్రదానం చేసిన సంస్థ ప్రతినిధి
ys jagan mohan reddy: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డు వరించింది. 2020-21 ఏడాదికి సంబంధించి ‘స్కోచ్ సీఎం’గా జగన్ మోహన్రెడ్డిని ఆ సంస్థ ఎంపిక..
ys jagan mohan reddy: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డు వరించింది. 2020-21 ఏడాదికి సంబంధించి ‘స్కోచ్ సీఎం’గా జగన్ మోహన్రెడ్డిని ఆ సంస్థ ఎంపిక చేసింది. దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా మెరుగైన పనితీరు కనబర్చినందుకు వైఎస్ జగన్కు స్కోచ్ సంస్థ ఈ అవార్డుకు ఎంపిక చేసి అభినందించింది. ఈ మేరకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో స్కోచ్ సంస్థ ప్రతినిధి సమీర్ కోచ్చర్ సీఎం జగన్ను మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా కోచ్చర్ సీఎం జగన్ మోహన్రెడ్డికి అవార్డును అందజేసి అభినందించారు. వివిధ రాష్ట్రాల్లో ప్రాజెక్టు స్థాయి ఫలితాల అధ్యయనం ఆధారంగా స్కోచ్ సీఎంగా జగన్ను ఎంపిక చేసినట్లు సంస్థ ప్రకటించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఆధారంగా ఈ అవార్డుకు ఎంపికచేస్తారు.
Also Read: