తాడేపల్లిగూడానికి మెగాస్టార్ చిరంజీవి..గ్రాండ్గా ఏర్పాట్లు!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా’ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. కాగా కలెక్షన్ల పరంగా కూడా చిరు మూవీ సత్తా చాటుతుంది. ఇక మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్గా చెప్పుకున్న ‘సైరా నరసింహారెడ్డి’ మూవీని చిరు తనయుడు, ప్రముఖ హీరో రామ్ చరణ్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సక్సెస్ను చిరు అభిమానులతో పంచుకోనున్నారు. తాడేపల్లిగూడెంలో ఈ నెల 6 వ తేదీన నట చక్రవర్తి ఎస్వీ రంగారావు విగ్రహ ఆవిష్కరణ చిరు చేతుల మీదుగా జరుగనుంది. ఈ […]
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా’ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. కాగా కలెక్షన్ల పరంగా కూడా చిరు మూవీ సత్తా చాటుతుంది. ఇక మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్గా చెప్పుకున్న ‘సైరా నరసింహారెడ్డి’ మూవీని చిరు తనయుడు, ప్రముఖ హీరో రామ్ చరణ్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సక్సెస్ను చిరు అభిమానులతో పంచుకోనున్నారు. తాడేపల్లిగూడెంలో ఈ నెల 6 వ తేదీన నట చక్రవర్తి ఎస్వీ రంగారావు విగ్రహ ఆవిష్కరణ చిరు చేతుల మీదుగా జరుగనుంది. ఈ మేరకు ఎస్వీఆర్ సేవాసంఘం అధ్యక్షుడు భోగిరెడ్డి రాము వివరాలు తెలిపారు. గురువారం స్థానిక కాపు కల్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో రాము మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహ ఆవిష్కరణకు చిరంజీవి అభిమానులు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. మౌలిక వసతులు, ట్రాఫిక్ సమస్యలు లేకుండా చిరంజీవి అభిమానులు సహకారం అందించాలన్నారు. సుమారు 40 వేల మంది కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. 6వ తేదీన మెగాస్టార్ చిరంజీవి హైదారాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని, అక్కడి నుంచి తాడేపల్లిగూడెం వస్తారన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, కాపు సంఘం నేతలు, ఎస్వీఆర్ సేవాసంఘం సభ్యులు పాల్గొన్నారు.